మెగాస్టార్ చిరంజీవి “ఫస్ట్ డే ఫస్ట్ షో” ప్రీ రిలీజ్ వేడుక కి ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా యాంకర్ సుమ వేడుకకు వచ్చిన చాలామంది ప్రముఖులను తమ కెరియర్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా అనుభూతి గురించి ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇదే ప్రశ్న చిరంజీవిని వేయగా సంచలన జవాబు ఇచ్చారు. తన చిన్నతనంలో సిక్స్త్ లేదా సెవెంత్ చదువుతున్న టైములో AVM ప్రొడక్షన్స్ నిర్మాణ సారధ్యంలో ఎన్టీ రామారావు హీరోగా వచ్చిన రాము సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కి వెళ్ళాలని.. చాలా కష్టపడి టికెట్లు తీసుకోవడం జరిగింది. నాతోపాటు తమ్ముడు నాగబాబు కూడా ఉన్నాడు.
వాడు మరీ చాలా చిన్నవాడు. అయితే మా చిన్నతనంలో సినిమా తీసుకెళ్లే విషయంలో నాన్నగారు ఎప్పుడు కూడా కుర్చీ టికెట్లు తీసుకునే వాళ్ళు. కానీ ఈ సినిమాకి మా బంధువు పూర్ణ అనే వ్యక్తి నేల టికెట్ తీసుకోవడం జరిగింది. అప్పటికే జనాల మధ్యకి ఎక్కిరిసిపోయి ఊపిరాడక.. అనేక కష్టాలు పడి లైన్ లో నించొని చివర ఆఖరికి టికెట్లు ఎలాగైనా తీసుకోగలిగా. తేరా మేము వెళ్లే ఆట కంటే ముందుగానే ఆ సినిమాకి నాన్నగారు తో పాటు అమ్మగారు కూడా సినిమా చూసి వస్తూ మమ్మల్ని చూసేశారు. ఏంటి ఇక్కడున్నారు అని ప్రశ్నించారు. ఆ సందర్భంలో నేను మీరు సినిమా చూడటానికి వచ్చారని తెలుసుకొని మేము కూడా చూద్దామని వచ్చాము అని జవాబు ఇచ్చాము.
అయితే మేము నేల టికెట్ తీసుకున్నామని నాన్నగారు తెలుసుకొని.. ఆ టికెట్ తీసుకున్నావు మరి.. తమ్ముడికి ఏమైనా అయితే అంటూ నన్ను ప్రశ్నించారు. దాంతో నాన్న చాలా కోపపడి అప్పుడే థియేటర్ బయట తోరణాలు పెట్టే క్రమంలో ఒక కొబ్బరి మట్ట అక్కడ ఉంది. దాన్ని తీసుకుని ఇరిపి థియేటర్ నుండి మా బంధువుల ఇంటి వరకు నన్ను కొడుతూనే ఉన్నారు. నెల్లూరులో కనకమహాల్ నుంచి మూలపేట వరకు చావబాదుకుంటు.. తీసుకెళ్లారు. మా నాన్నగారికి కోపం వస్తే అసలు ఆగదు. సో ఫస్ట్ డే ఫస్ట్ షో.. నా జీవితంలో ఎక్స్పీరియన్స్ అది. ఇప్పటికీ కూడా ఏవిఎమ్ ప్రొడక్షన్స్ అంటే కొద్దిగా వణుకు పుడుతుంది. అప్పుడు అది వేరే రకంగా ఉన్నా… కానీ ఇప్పటికీ అది ఒక తీపి జ్ఞాపకం అంటూ చిరంజీవి తనదైన శైలిలో కొత్త విషయాన్ని “ఫస్ట్ డే ఫస్ట్ షో” సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తెలియజేయడం జరిగింది.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?