అమరావతి, ఏప్రిల్ 22 : అవినీతి నిరోధక శాఖ డిజిగా ఏబి వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంటలిజెన్స్ డిజిగా పని చేస్తున్న ఏబి వెంకటేశ్వరరావును వైసిపి నేతల పిర్యాదు మేరకు ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు పోలీస్ కేంద్ర కార్యాలయంలో ఉన్న ఆయనకు పోస్టింగ్ ఇస్తూ నేడు ఉత్తర్వులు వెలువడ్డాయి.