Guppedantha Manasu,25 October,590 Episode:బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు అక్టోబర్ 25వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.గత ఎపిసోడ్ లో మహేంద్ర, జగతి ఇద్దరు ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో రిషి చాలా బాధ పడుతూ ఉంటాడు.అదే సీన్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది.ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే వసు రిషితో, వాళ్ళిద్దరూ వెళ్లిపోవడానికి ఒక రకంగా మనిద్దరం కూడా కారణమే అయి ఉండొచ్చు కదా సార్ గురుదక్షిణ విషయంలో అని వసు అనగా, ఎందుకు వసుధార ప్రతిసారి తిరిగి అక్కడే వస్తావు..నేను అందర్నీ అర్థం చేసుకుంటే మరి నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు అని అంటాడు రిషి. దానికి వసు, నేనున్నాను కదా అని అంటుంది వసు.అప్పుడు రిషి, ఇంక పదా లోపలికి కి వెళ్దాము మీటింగ్ కి డాడ్ వాళ్ళని కూడా రమ్మని అఫీషియల్ గా మెయిల్ కూడా పెట్టాను కదా వాళ్ళు కచ్చితంగా వస్తారు అని అంటాడు. ఇక మీటింగ్ గది బయట రిషి, వసుధారలు చాలాసేపటి వరకు ఎదురు చూస్తూ ఉంటారు.
డాడ్ కోసం ఎదురుచూస్తున్న రిషి :
మరోవైపు జగతి, మహీంద్ర లు గౌతమ్ తో మాట్లాడుతూ, రిషి మా గురించి బాధపడుతున్నాడని మాకు తెలుసు గౌతమ్ కానీ ఈ పరిస్థితుల్లో ఇదే చేయాలి లేకపోతే రిషి మమ్మల్ని అర్థం చేసుకోడు అని అంటారు. అదే సమయంలో వసు గౌతమ్ కి మెసేజ్ పంపిస్తుంది రిషి సార్ మహేంద్ర సార్ కోసం చాలా బాధపడుతున్నారు అని అంటుంది. అప్పుడు గౌతమ్, వసుధార మెసేజ్ పంపింది అంకుల్ రిషి మీకోసం బాధపడుతున్నాడట చాలా కంగారుగా ఉన్నాడట అని అనగా నాకు రిషి మనసు నాకు తెలుసు గౌతమ్.అఫీషియల్ గా మాకు మెయిల్ పెట్టాడు కదా వస్తాము అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు అని బాధపడతారు.
అప్పుడు గౌతమ్ ఆలోచిస్తూ ఇప్పుడే వస్తాను అని అటువైపు వెళ్లి రిషికి మెసేజ్ చేస్తూ, నేను ఒక చోటికి రమ్మంటాను అక్కడికి రా అని లొకేషన్ షేర్ చేస్తాడు అది చూసిన రిషి ఎంతో ఆశగా మీటింగ్ క్యాన్సిల్ చేసేమని చెప్పి వసును తీసుకుని బయలుదేరాతాడు.
ఫుల్ హ్యాపీ మూడ్ లో దేవయాని :
మరోవైపు దేవయాని ఎవరికో ఫోన్ చేసి హమ్మయ్య శుభవార్త చెప్పారు అయితే జగతి, మహేంద్రలు మీటింగ్ కి రాలేదన్న మాట అని ఫోన్ పెట్టేసిన తర్వాత ఎదురుగా ధరణి ఉంటుంది. ధరణి ని చూసిన దేవయాని ఉలిక్కిపడి ఎప్పుడు వచ్చావు ధరణి, ఈమధ్య నన్ను భయ పెట్టేస్తున్నావు. ఏమీ ఇవన్నీ విని ఎవరికైనా చాడీలు చెప్పి గూడచారం చేస్తున్నావా అని అనగా, నేనెందుకు అలా చేస్తాను అత్తయ్య గారు. మీరే నా దైవం కదా అని అంటుంది.నేను జీవితంలో ఎంతో మందిని చూశాను కాని నీ లాంటి వాళ్ళ గురించి మాత్రం ఎప్పటికీ ఒక అంచనా వేయలేకపోతున్నాను నువ్వు ఎప్పటికైనా ఒక వసుధార లాగా ఒక జగతి లాగా తయారవుతావేమో అని భయమేస్తుంది. నువ్వు ఎప్పటికీ దేవయాని కోడలువే అది గుర్తు పెట్టుకో అంటుంది దేవయాని. సరే అత్తయ్య గారు కాఫీ స్ట్రాంగ్ గా కావాలా లైట్ గా కావాలా అంటే ఏదోటి తగలెయ్యి అంటుంది దేవయాని..అప్పుడు ధరణి మనసులో నవ్వుకుంటు అక్కడ నుండి వెళ్తుంది.
Guppedantha Manasu,25 October,590 Episode:మహేంద్ర, జగతి గురించి తెలుసుకున్న రిషి :
ఆ తర్వాత సీన్లో జగతి,మహేంద్రలు, గౌతమ్ కూర్చుని ఉండగా ఇంతలో రిషి ఆ ఇంటి తలుపు కొట్టి గౌతమ్ అని అరుస్తాడు. ఆ గొంతు విని జగతి, మహేంద్రలు భయపడి రిషి ఇక్కడికి ఎలా వచ్చాడు. తెలిసిపోయిందా? గౌతమ అసలు ఏం జరుగుతుంది అని గౌతమ్ మీద అరుస్తారు. దానికి గౌతమ్, నేనే చెప్పాను అంకుల్. అందరూ కూర్చొని మాట్లాడుకుంటే తేలుతుంది కదా అని అనగా, గౌతమ్ ఎందుకిలా చేస్తున్నావు స్నేహభావం ప్రదర్శిస్తున్నావా అంటాడు. సరే మేము వెళ్లి మేము పక్కన దాకుంటాము రిషికి కానీ మేము ఇక్కడ ఉన్నట్టు తెలిస్తే జీవితంలో నేను నీతో మాట్లాడను అని గౌతమ్ కు చెప్పి మహేంద్ర, జగతి గదిలో దాక్కుంటారు.ఇంతలో రిషి పదే పదే తలుపు కొడతాడు. అప్పుడు తలుపు తీసిన వెంటనే ఎందుకురా ఇంతసేపు అయింది తలుపు తీయడానికి. డాడ్ వాళ్లు ఇక్కడే ఉన్నారు కదా నాకు తెలుసు నువ్వు అందుకే నాకు ఫోన్ చేశావు అని డాడ్! డాడ్! అని అరుస్తూ ఉంటాడు.
పాపం రిషి డాడ్ కోసం ఎంతో బాధ పడుతున్నాడుగా?
అప్పుడు గౌతమ్, లేదురా అంకుల్ వాళ్లు ఇక్కడ లేరు నేను నీతో మాట్లాడదామని పిలిచాను సాయంత్రం వస్తావు అనుకున్నాను కానీ ఇప్పుడే వస్తావ్ అనుకోలేదు అని అనగా, నాకు డాడ్ కన్నా ఇంకేమీ ఎక్కువ కాదురా..వారి కోసం ఎంతకైనా వెళ్తాను అని రిషి అంటాడు ఆ మాటలు విని జగతి, మహీంద్రలు బాగా ఏడుస్తారు. ఆ సీన్ చూడడానికి చాలా ఎమోషనల్ గా ఉంటుంది.ఇంతలో వసుధార మంచినీళ్లు కోసం మహేంద్ర వాళ్ళు ఉన్న వైపు వెళ్తుండగా గౌతమ్ ఆపి నేను వెళ్లి తెస్తాను మీరు అటు ఇటు తిరుగొద్దు కూర్చోండి అని అంటాడు.
కొడుకుని చూసి కన్నీటి పర్యంతం అయిన జగతి, మహేంద్రలు :
అటువైపు వెళ్లి మంచినీళ్లు తెస్తాడు గౌతమ్. ఇంతలో మహేంద్ర టేబుల్ మీద ఉన్న రిషి,మహేంద్ర ఫోటో చూసి గౌతమ్ కు సైగ చేసి చెబుతాడు. అప్పుడు గౌతమ్ నెమ్మదిగా ఆ ఫోటోని కప్పేస్తాడు.అప్పుడు రిషి గౌతమ్ తో, ఎప్పుడు డాడ్ నా మీద ఇంత కోపంగా లేరు రా..ఏ చిన్న కోపం వచ్చినా సరే నన్ను తిట్టేవారు అంతేకానీ ఇలా ఎప్పుడూ వెళ్లిపోయింది లేదు. ఇప్పుడు నాకు డాడ్ కనిపిస్తే వెళ్లి సారీ చెప్తాను డాడ్ కూల్ అవుతారు.డాడ్ ది చిన్న పిల్లాడి మనసు అని అంటాడు. దానికి జగతి, మహేంద్రలు బాధతో ఏడుస్తూ ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!