ఏపి (AP)సచివాలయంలో శుక్రవారం ఉద్యోగులకు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రెండు వారాల క్రితం సీఎస్ గా జవహర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. సాధరంగా ప్రతి రోజు తన ఛాంబర్ కు వెళ్లి విధులు నిర్వహించే సీఎస్ జవహర్ రెడ్డి శుక్రవారం అనూహ్యంగా కార్యాలయానికి వచ్చీ రాగానే మూడవ బ్లాక్ లోకి వెళ్లి ఉద్యోగులు ఎవరెవరు ఉన్నారు. సమయానికి వస్తున్నారా లేదా అని ఆరా తీశారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ, మైనార్టీ వెల్ఫేర్, పర్యాటక శాఖల్లో ఉద్యోగుల పని సమయాన్ని సీఎస్ జవహర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఎంత అటెండెన్స్ ఉంది. ఎంత మంది వచ్చారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల సీటు వద్దకు వెళ్లి మరీ తనిఖీ చేశారు. సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన రెండు వారాల్లోనే ఇలా పలు విభాగాల్లో ఆకస్మిక తనిఖీ చేయడంతో ఇతర శాఖల్లో ఉద్యోగులు అలర్ట్ అయ్యారు. ఇలా ఆకస్మిక తనిఖీలు చేసే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు.
Breaking: మలేషియా రాజధాని శివారులో విరిగిపడిన కొండచరియలు .. ఇద్దరు మృతి, 51 మంది గల్లంతు