ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ `సాహో`. యు.వి.క్రియేషన్స్ బ్యానరపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ముందుగా శంకర్, ఎహ్సాన్, లాయ్ సంగీత దర్శకులుగా నిర్ణయించారు. అయితే విడులకు ముందు సినిమా నుండి తాము తప్పుకుంటున్నట్లు ఈ సంగీత త్రయం ప్రకటిచారు. ముందు కారణం చెప్పలేదు కానీ.. ఈరోజు `సాహో` నుండి ఎందుకు తప్పుకున్నామనదే దానిపై వారు వివరణ ఇచ్చారు.
“ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ నుండి పాటలు యాడ్ చేయించాలని చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తుంది. అది మాకు అసౌకర్యంగా అనిపించింది. మాకు మేమే సంగీత దర్శకులుగా ఉండాలనుకున్నాం. అందుకనే తప్పుకున్నాం. సినిమాకు సంగీతంతో పాటు నేపథ్య సంగీతం కూడా అందించాలనుకున్నాం కానీ చిత్ర నిర్మాణ సంస్థ మరొకరిని నియమించుకుంది. కనీసం పాటల వరకు అయినా మమ్మల్ని తీసుకోలేదు. ఎక్కువ మందితో కలిసి పనిచేయడం అసౌకర్యంగా అనిపించింది“ అన్నారు సంగీత త్రయం.
ప్రస్తుతం చిత్రీకరణ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుందీ చిత్రం. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ కథానాయిక శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడి వంటి బాలీవుడ్ తారలు నటిస్తున్నారు. అలాగే హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!