BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇంతకు విచారణను ఎదుర్కొన్న సమయంలోనే నోటీసులు ఈడీ జారీ చేయగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు ఇడీ, ఐటీ అధికారులు రాష్ట్రానికి వస్తారని, ఆ తర్వాత మోడీ వస్తారంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కవిత ఇంటిపై ఈడీ, ఐటీ సోదాలు చేపట్టడం తీవ్ర సంచలనం అయ్యింది.
ఢిల్లీ నుండి హైదరాబాద్ కు వచ్చిన పది మంది అధికారుల బృందం కవిత నివాసానికి చేరుకుని సోదాలు చేస్తొంది. ఐటీ, ఈడీ అధికారులతో కలిసి జాయింట్ గా .. మొత్తం నాలుగు టీమ్ లు ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల నేపథ్యంలో కవిత నివాసం ముందు భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కవిత ఇంటికి చేరుకున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ సోదాలు జరుగుతుండటం బీఆర్ఎస్ లో ఆందోళన రేకెత్తిస్తొంది. లిక్కర్ స్కామ్ కేసులో పలు మార్లు విచారణకు హజరు కావాలని నోటీసులు జారీ చేసినా ఇటీవల కాలంలో హజరు కావడం లేదు.
గత పదేళ్ల ఆర్ధిక లావాదేవీలపై ఈడీ వివరాలు సేకరిస్తుంది. కవిత, ఆమె సహాయకుల సెల్ ఫోన్ లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై ఈడీ ఆరా తీస్తొంది. కాగా, ఈడీ విచారణపై కవిత సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ పై ఈ నెల 19న విచారణ జరగనుంది. తనపై చర్యలు తీసుకోకుండా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై విచారణ పెండింగ్ లో ఉండగానే కేంద్ర దర్యాప్తు సంస్థలు జాయింట్ గా సోదాలు చేపట్టడం విశేషం.
YSRCP: వైసీపీ కండువా కప్పుకున్న ముద్రగడ