భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొందరు ప్రాణాలను కోల్పోయారు. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ ఈ వరదల్లో చిక్కుకున్నారు. 35 మందితో కలిసి మంజు వారియర్ ఓ షార్ట్ ఫిలింను చిత్రీకరించడానికి చత్రు ప్రాంతానికి వెళ్లి ..రోడ్డు దెబ్బతినడంతో వరదల్లో చిక్కుకున్నారు. ప్రభుత్వం అక్కడి ప్రజలను కాపాడే ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. మంజు వారియర్ బృందాన్ని కాపాడాలని ఆమె సోదరుడు ముఖ్యమంత్రికి విన్నపం చేశాడు. తమకేదైనా ప్రమాదం జరిగితే తమదే బాధ్యతని, ప్రభుత్వానిది కాదని చిత్ర బృందం సహాయాన్ని తిరస్కరించింది. దీంతో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ రంగంలో దిగి ఎలాగైనా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
previous post
next post
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?