అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాల్సిందేనంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రంగా స్పందించారు.
తుగ్లక్ ముఖ్యమంత్రి పాలన చూసి ఆయనకు మైండ్ కూడా పోయిందని బుద్దా విమర్శించారు. ఆయనకు ఇప్పుడు మెంటల్ నాల్గవ దశకు చేరుకుందని బుద్దా వ్యాఖ్యానించారు. ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చే ఆసుపత్రులు ఈ దేశంలో లేవని బుద్దా అన్నారు. సరదాగా ఒక సారి సెర్బియా వెళ్లి రావాలని సూచిస్తూ అంతా అక్కడి పోలీసులు చూసుకుంటారని బుద్దా వ్యాఖ్యానించారు.