అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్టర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ట్విట్టర్ వేదికగా వారిపై బుద్దా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
అబద్దాలు చెప్పడం, చట్టాన్ని ఉల్లంఘించడం, ప్రజల్ని దోచుకోవడం, విధ్వంసం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు అని బుద్దా పేర్కొన్నారు.
‘డెంగ్యూతో ప్రజలు చస్తుంటే సంబరాలు చేసుకోవడం, ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే జోకులు వెయ్యడం, 45 ఏళ్లకే పెన్షన్ అని మహిళలను మోసం చెయ్యడం, ప్రభుత్వ ఆస్తులు అమ్మేయడం, సొంత వారిని లేపేయడం అన్నీ వ్యాధి లక్షణాలే వాళ్లు మాత్రం ఏమి చేస్తారు పాపం’ అంటూ బుద్దా ట్వీట్ చేశారు.