NewsOrbit
రాజ‌కీయాలు

‘బాబును ఇక జనం నమ్మరు’

‘బాబును ఇక జనం నమ్మరు’
ఇచ్ఛాపురం, జనవరి 9: రాష్ర్ట ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబును ఇక నమ్మరని వైసిపి అధినేత వైఎస్ జగన్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం వద్ద పాదయాత్రను ముగించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ పరిపాలన పూర్తిగా అవినీతి, అక్రమాల మయం అయ్యిందని ఆరోపించారు.
ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు బిజెపితో కాపురం చేశారని ఆయన అన్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు మోదీతో పోరాటం అంటూ జనాన్ని మోసం చేస్తున్నారని జగన్ విమర్శించారు. గత ఎన్నికల ముందు జాబు కావాలంటే బాబు రావాలన్నారనీ, చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు మాత్రం లేవనీ జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఎన్నికలకు మూడునెలల ముందు మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారని ఆయన అన్నారు.
అధికారంలోకి రావడానికి తనకు అన్నివర్గాల తోడు కావాలని ఆయన కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్ధను పూర్తిగా ప్రక్షాలనం చేస్తానని ఆయన చెప్పారు. ప్రతి పధకం పేదవాడి ఇంటికి నేరుగా చేరుస్తానని ఆయన అన్నారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తానని ఆయన తెలిపారు. ప్రతి కలెక్టర్ ఏడు అసెంబ్లీ స్థానాలకు జవాబుదారీతనంగా ఉండాలనీ, అందుకు తగినట్లుగా పాలనా వ్యవస్ధలో మార్పులను తెస్తామనీ ఆయన పేర్కొన్నారు.
నవరత్నాల పథకాల అమలుకు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకువస్తామని ఆయన చెప్పారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే పధకాలను తీసుకువస్తామని ఆయన తెలిపారు.
రైతన్నలకోసం వడ్డీ లేకుండా రుణాలను అందజేస్తామనీ, పగటి పూట తొమ్మిది గంటల పాటు ఉచితంగా ఇస్తామనీ, వ్యవసాయ పెట్టుబడికోసం 12,500 కోట్ల రూపాయలు నేరుగా రైతన్న చేతిలో పెడతామనీ, బోర్లు ఉచితంగా ఇస్తామనీ, పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
మూడు వేల కోట్లతో రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్పారు. పంటలకు ముందుగానే కొనుగోలు ధరలను నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. కరవు నివారణకు నాలుగు వేల కోట్ల రిజర్వ్ నిధులను సమకూరుస్తామని ఆయన చెప్పారు. సహకార రంగాన్ని పటిష్టవంతం చేసీ డెయిరీ రంగాన్ని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు.
రాష్ర్టంలోని అన్ని ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానని జగన్ తెలిపారు.
ప్రతి పేదవాడికి మంచి చేయాలన్నదే తన ధ్యేయమనీ, తాను చనిపోతే ప్రతి ఇంట్లో తన ఫొటో ఉండాలన్న ఆశ తప్ప మరేం లేదని జగన్ చెప్పారు.

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

Leave a Comment