ప్రయాగ్రాజ్: మకర సంక్రాంతి పర్వదినాన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రారంభమైన అర్థ కుంభమేళా మహాక్రతువుకు భక్తులు పోటెత్తారు. ఈ కుంభమేళా మార్చి నాల్గవ తేదీ వరకూ కొనసాగనుంది. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. స్నానఘాట్ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, పారా మిలటరీ బలగాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 20వేల మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. మంగళవారం 35వేలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. భక్తుల కోసం 35 స్నానఘాట్లను ఏర్పాటు చేశారు.
అర్థకుంభమేళా వీడియో కోసం కింద క్లిక్ చేయండి
#ShahiSnan https://t.co/EKsMdUst5G
— Information and Public Relations Department, UP (@InfoDeptUP) January 15, 2019