సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో 27వ సినిమాగా తెరకెక్కుతుంది. గత కొన్ని రోజులుగా మహేష్ సినిమా విషయంలో ఎంతటి సస్పెన్స్ నెలకొందో అందరికి తెలిసిందే. దానికి తెర దించుతు ఇటీవల తన సినిమాని అధికారకంగా ప్రకటించి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు సూపర్ స్టార్.
ఇక ఈ సినిమా పోస్టర్ లోనే చాలా విషయాలను చెప్పకనే చెప్పాడు దర్శకుడు పరశురామ్. ఈ సినిమా కథ కూడా పక్కా కమర్షియల్ పంథాలోనే సాగుతుందని అర్థమవుతోంది. గత కొంత కాలంగా శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి క్లాస్ సినిమాలు చేస్తూ వచ్చిన సూపర్ స్టార్ సడన్ గా యూ టర్న్ తీసుకున్నాడు. ఇక గీత గోవిందం లాంటి ఎమోషనల్ కథలు రాసుకుంటూ వచ్చిన పరశురామ్..ఈ సారి మాత్రం మహేష్ బాబు కోసం పక్కా మాస్ కథను సిద్ధం చేసాడు.
సూపర్ స్టార్ ఇమేజ్ మరింతగా పెంచేలా అద్భుతమైన కథ ని రాసినట్టు తాజా సమాచారం. ఈ సినిమాలో మహేష్ ని పరశురామ్ ఓ ఆర్థిక నేరస్తుడి పాత్రలో చాలా వినూత్నంగా చూపించబోతున్నాడట. ఇక డబ్బుకు గుర్తుగానే మెడపై రూపాయి కాయిన్ చిహ్నాన్ని టాటూగా ముద్రించు కుంటాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు మహేష్ చేసిన సినిమాల కంటే పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక మహేష్ … థమన్ ల మ్యాజిక్ ఏడు సంవత్సరాల రిపీటవుతుండటం విశేషం.