పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా దాదాపు కంప్లీటవచ్చింది. లాక్ డౌన్ తీసేయగానే మిగిలి ఉన్న 10 శాతం షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టు లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. శృతి హాసన్ గెస్ట్ అపీరియన్స్ ఇస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాశ్ రాజ్, సీనియర్ నరేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లాయర్ గా నటిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో రెండేళ్ళ తర్వాత గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత కూడా వరసగా సినిమాలు అంగీకరించి ఉన్నాడు. వీలైతే ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనడానికి సిద్దంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే పవర్ స్టార్ క్రిష్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఆల్రెడి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారట. అయితే లాక్ డౌన్ తో విదేశాలలో అనుకున్న షెడ్యూల్స్ మొత్తం క్యాన్సిల్ చేసి సినిమా మొత్తాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో కంప్లీట్ చేసేందుకు భారీ సెట్స్ ని సిద్దం చేస్తున్నారట. క్రిష్ ఇందుకు సంబంధించిన సెట్స్ ఆర్ట్ డైరెక్టర్ తో కూర్చిని డిజైన్ కూడా చేశారు.
ప్రస్తుతం షూటింగ్ కి కావాల్సిన అన్ని సిద్దమయ్యాయట. ఇక ఈ సినిమాలో ప్రముఖ నటుడు జైరాం కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు భారీ క్యాస్టింగ్ తో పాటు యుద్ధ సన్నివేశాల కోసం గుర్రాలతో యాక్షన్ సీక్వెన్సెస్ ని చిత్రీకరించనున్నారట. ఇక ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవర్ స్టార్ నటించబోతున్నాడు. క్రిష్ సినిమా షెడ్యూల్ గ్యాప్ వస్తే మాత్రం ఆ గ్యాప్ లో హరీష్ శంకర్ తో సెట్స్ మీదకి వెళతాడట పవర్ స్టార్.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!