టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ లీడ్ లో ఉంది కీర్తి సురేష్. మహానటి సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో అందరీని ఆకట్టుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు తెలుగు తమిళ సినిమాలలో చాలా బిజీగా ఉంది. దాదాపు 6-7 సినిమాలు కమిటయి 2021 ఆఖరు వరకు బిజీ అంటోంది. తెలుగులో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న రంగ్ దే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా నితిన్ సరసన మరో సినిమా చేసే అవకాశాలున్నాయని సమాచారం.
ఇక తమిళంలో నిర్మించిన తాజా చిత్రం పెంగ్విన్. ఈ సినిమాలో ప్రెగ్నెంట్ లేడీగా ప్రయోగాత్మక పాత్రలో నటిస్తుంది కీర్తి సురేష్. తల్లీ కొడుకు మధ్య ఉన్న ఎమోషనల్ డ్రామా తో పాటు థ్రిల్లర్ జోనర్ ని జోడించి ఈశ్వర్ కార్తీక్ ఈ సినిమాని తెరకెక్కించాడు. కేవలం 35 రోజుల్లో పూర్తి చేసిన ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో తో పాటు తెలుగు హిందీ మళయాళం లో ఈ సినిమా జూన్ 19 న నేరుగా అమెజాన్ ప్రైం లో రిలీజవుతోంది. తమిళ స్టార్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాని నిరించారు.
ఇక ఈ సినిమాలతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ కాన్వాయిస్ మూవీ అన్నాత్తే లో కీర్తి సురేష్ ఒక కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే మిస్ ఇండియా అనే ద్విభాషా చిత్రం, గుడ్ లక్ సఖీ కూడా తన చేతిలో ఉన్నాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న తాజా చిత్రం సర్కారు వారి పాట లో కూడా కీర్తి సురేష్ నటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. అయితే ప్రస్తుతం కరోనా దెబ్బ కి నార్త్ అండ్ సౌత్ సినిమా ఇండస్ట్రీలు కుదేలయ్యాయి.
ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మేకర్స్ లో హీరో హీరోయిన్స్ తో పాటు ఇతర టెక్నీషియన్స్ కి ఇచ్చే రెమ్యూనరేషన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అందరి కంటే ముందు కీర్తి సురేష్ తను నటించబోయో సినిమాలకి రెమ్యూనరేషన్ తగ్గించుకుంటాని వెల్లడించి మిగతా అందరికి ఆదర్శంగా నిలిచింది. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఏ ఒక్క స్టార్ హీరో కూడా తమ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటాని వెల్లడించలేదు. అలాంటి సమయంలో కీర్తి సురేష్ తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే తనకి కథ నచ్చితేనే అంటూ కండీషన్ పెట్టడం విశేషం.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!