విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డీసెంట్ హిట్ ‘పెళ్ళిచూపులు’. ఈ సినిమాతో తెలుగు అమ్మాయి రీతూ వర్మ హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆకట్టుకున్న రీతూ వర్మ ఆ తర్వాత ఎందుకనో వరసగా అవకాశాలు అందిపుచ్చుకోవడం లో మాత్రం వెనకబడింది. అయితే తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తుంది.
ఇప్పటి వరకు ‘పెళ్ళిచూపులు’ సినిమా తర్వాత తనకి నచ్చిన కథ ఎవరు చెప్పలేదట. అందులోను రూతు వర్మ కి కొన్ని లిమిటేషన్ ఉండటంతో తెలుగులో కనిపించ లేదట. కాని తమిళంలో మాత్రం తనకి సమయం దొరకనంతగా సినిమాలు చేస్తోంది. అయితే గత కొంతకాలంగా చాలామంది రీతూ వర్మని తెలుగు సినిమాలు చేయమని కోరుతున్నారు. దాంతో కొన్ని కథలు విన్న రీతూ వర్మ నచ్చిన ప్రాజెక్ట్స్ కి ఎస్ చెప్పిందట.
ఈ నేపథ్యంలో తెలుగులో ఇప్పుడు నాలుగు సినిమాలు ఒప్పుకుందని తెలుస్తుంది. శర్వానంద్ హీరోగా రూపొందనున్న తెలుగు తమిళ సినిమా ఒకటి కాగా నేచురల్ స్టార్ నాని శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న టక్ జగదీష్ లో చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఇవి కాకుండా మరో రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ వివరాలను మేకర్స్ వెల్లడిస్తారని అంటోంది.
ఇక ఈ తెలుగమ్మాయి ప్రస్తుతం లాక్ డౌన్ ని ఫ్యామిలీతో కలిసి బాగా గడిపిందట. ఈ సమయంలోనే అమ్మానాన్నలు కొన్ని సార్లు పెళ్లి ప్రస్థావన తీసుకు వచ్చారట. అయితే తను ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలతో బిజీ అవుతున్నా కదా..ఇంకా కొంతకాలం ఆగి చేసుకుంటా..అంటు సమాధానం చెప్పిందట. ఇదే మాట ఫ్యాన్స్ కి కాస్త సరదాగా నా “పెళ్ళి చూపులు” కి ఇంకా చాలా టైం ఉందని సినిమాటిక్ ఆన్సర్ ఇచ్చిందట.
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!