ఆంధ్రప్రదేశ్ లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అత్యధిక సంఖ్యలో కరోనా టెస్టింగ్ జరుగుతున్న విషయం ప్రశంసనీయమే. అయితే గత ఏడు రోజులుగా రాష్ట్రంలో 76 కోవిడ్ మరణాలు సంభవించడం గమనార్హం. అంటే సగటున రోజుకి 11 మంది చప్పున రాష్ట్రంలో చనిపోతున్నారు. అయితే ఈ విషయాన్ని మాత్రం అటు ప్రభుత్వం గాని మరియు మీడియా కానీ ప్రజల మధ్య సరిగ్గా ప్రస్తావించడం లేదు.
ఆంధ్రప్రదేశ్లో లో రోజూ నమోదు చేసిన కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా చాలా మంది వైద్య నిపుణులు మరియు అధికారులు మధ్య వయస్సులో ఉన్న పేసాంట్లను, రిస్క్ లేని యువకులను హోమ్ క్వాంటైన్ కే పరిమితం చేస్తున్నారు. అంతేకాకుండా కొత్తగా వెంటిలేటర్ల ఏర్పాటు మరియు ఐసీయూ నిర్వహణ కూడా చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఈ చావులను ఎందుకు ఆపలేకపోతుంది అన్న విషయాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు.
ఇంకా చెప్పాలంటే రోజుకొక కొత్త మందు మరియు వైరస్ తో పోరాడగలిగే ఇంజక్షన్లు పుట్టుకొస్తున్నట్టు వార్తలు నేపథ్యంలో ప్రభుత్వం ఎంతో ముందుగా క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. అటు తెలంగాణలో పరిస్థితి మరింత విషమంగా ఉన్న పేషెంట్లకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేపట్టి చివరికి వాటిని గతవారమే మొదలుపెట్టేసింది కూడా. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. అంతేకాకుండా కోవిడ్ పేషెంట్ల పాలిట వరంగా మారిన ‘ప్లాస్మా థెరఫీ’ ని కూడా ఆంధ్రప్రదేశ్లో సమర్ధవంతంగా నిర్వహించడంలేదు అని ఎన్నో అభియోగాలు ఉన్నాయి.
జగన్ ప్రభుత్వం అధిక సంఖ్యలో వైద్య సిబ్బందిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే దాని ద్వారా ఎంత మంది రాష్ట్ర వైద్య శాఖలో చేరారు అన్న విషయంపై స్పష్టత లేదు. ఆ పోస్టులు అన్నీ భర్తీ అయి ఉంటే ఈ మరణాలను ఆపడం మరింత సులువు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం ఈ సమయంలో రాజకీయాల చుట్టూ తిరగడం మానేసి ప్రస్తుతం ప్రజల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా తమ అధికారం కొనసాగిస్తే మేలని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.