విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం చూస్తోంది. అయితే, అందులో చిత్తశుద్ధి ఎంత.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నేనంటారు రాజకీయ విశ్లేషకులు.ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరాల్లో విశాఖపట్నం కూడా ఒకటి. నిజానికి విశాఖ, ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధాని. ఉమ్మడి తెలుగు రాష్ట్రం హైద్రాబాద్ తర్వాతి స్థానం విశాఖదే.
దురదృష్టవశాత్తూ ఉమ్మడి రాష్ట్రంవిభజన తర్వాత కూడా విశాఖ అభివృద్ధిపై పాలకులు దృష్టి పెట్టలేదు. చంద్రబాబు హయాంలో విశాఖ చుట్టూ చాలా పబ్లిసిటీ స్టంట్లు నడిచాయి. ఇప్పుడూ దాదాపుగా అదే జరుగుతోందని వారంటున్నారు
ఇతరత్రా రాజకీయాల సంగతి పక్కన పెడితే, విశాఖ బ్రాండ్ ఇమేజ్ మాటేమిటి.? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను మార్చుతామంటోన్న ప్రభుత్వం, విశాఖలో పరిశ్రమల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.? యుద్ధ ప్రాతిపదికన పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహిస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం, ఆ తనిఖీలు నిర్వహించిందా.? లేదా.? నిర్వహిస్తే సాయినార్ పరిశ్రమలో ఎందుకు ప్రమాదం చోటు చేసుకుంది.? చిన్న చిన్న ప్రమాదాలు వేరు.. ప్రమాదకర వాయువులు లీక్ అవడం వేరు. ప్రమాదకర వాయువులు లీక్ అయితే.. ఆ ప్రభావం పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏదిఏమైనా, విశాఖ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వుంది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా వున్న విశాఖ బ్రాండ్ ఇమేజ్పై ఇలాంటి ఘటనల ద్వారా దెబ్బ పడితే.. అది రాష్ట్రానికే తీవ్ర నష్టం.
విశాఖలో ఇటీవలే ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి విషవాయువులు లీక్ అవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సంస్థలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖుడి బంధువు కీలక ‘పొజిషన్’లో వున్నాడనే ఆరోపణలు అప్పట్లో విన్పించిన విషయం విదితమే. ఆ కారణంగానే, హుటాహుటిన ముఖ్యమంత్రి విశాఖ వెళ్ళారనీ, మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ప్రకటించారనీ విపక్షాలు విమర్శించాయి. అయితే, దేశాన్ని కుదిపేసిన ఆ దుర్ఘటన, విశాఖ బ్రాండ్ ఇమేజ్ని దారుణంగా దెబ్బతీసిందన్నది నిర్వివాదాంశం.వైజాగ్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఇమేజ్ ఇండైరెక్టుగా దెబ్బతింటున్న ట్లు కనిపిస్తోంది. ఇప్పుడే ముఖ్యమంత్రి ఆ డ్యామేజీ ని సరి చేసుకోవడం ఎంతైనా అవసరమంటున్నారు