వైసీపీ ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపించిన ఎంపీ రఘురామకృష్ణం రాజు మీద ఫోకస్ చేసినట్లే నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని కూడా పార్టీ అధిష్టానం టార్గెట్ చేసినట్లు సమాచారం అందుతోంది.
ఒక ఎంపీతో పాటు మరో ఎమ్మెల్యే కూడా షాక్ ట్రీట్మెంట్ ఇస్తేనే పరిస్థితి పూర్తిగా అదుపులో కొస్తుందని ముఖ్యమంత్రి జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు బోగట్టా.ఆనం రామనారాయణరెడ్డిపై జగన్ అసంతృప్తితో ఉన్నారు. ఆయన తరచూ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతూ చేస్తున్న వ్యాఖ్యలు జగన్ కు ఆగ్రహం తెప్పించాయంటున్నారు.ఈ సందర్భంగా నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి పేరు మరోసారి తెరపైకి వచ్చింది.
రాజకీయాలను నేదురుమిల్లి కుటుంబాన్ని విడదీసి చూడలేం. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన కుటుంబం నుంచి నేదురుమిల్లి రాజ్యలక్ష్మి మంత్రిగా పనిచేశారు. తొలి నుంచి నేదురుమిల్లి కుటుంబం కాంగ్రెస్ లోనే ఉంది. ఆ కుటుంబానికి కాంగ్రెస్ లో ప్రత్యేక స్థానం కూడా ఉంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఈ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది.. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంంలో నేదురుమిల్లి కుటుంబానికి పట్టుంది. అక్కడి నుంచే ఆ కుటుంబం ప్రాతినిధ్యం వహించింది. అయితే ఎన్నికలకు ముందే నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు వెంకటగిరి సీటు దక్కుతుందని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఆనం రామనారాయణరెడ్డికి జగన్ వెంకటగిరి సీటును కేటాయించారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది.
అయితే ఆనం రామనారాయణరెడ్డి తరచూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విమర్శలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో జగన్ ఆనం రామనారా నారాయణరెడ్డికి చెక్ బెట్టేందుకు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దింపి ఆయన్ని వెంకటగిరి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా జగన్ నియమించే అవకాశాలున్నట్లు అత్యున్నత వర్గాల ద్వారా తెలిసింది.తద్వారా ఆనం రామనారాయణ రెడ్డికి కళ్లెం వేయవచ్చు నన్నది జగన్ వ్యూహం అంటున్నారు ఏదేమైనా తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు నేదురుమిల్లి కుటుంబానికి కలసి వస్తున్నాయని చెబుతున్నారు.