రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చలో రామతీర్థం ramatheertham కార్యక్రమానికి బీజెపీ bjp – జనసేన janasena పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు, ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ముఖ్యనేతలను హౌస్ అరెస్టు చేశారు. విశాఖ, విజయనగరం బిజేపీ కార్యాలయాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ visakha బిజెపి bjp కార్యాలయానికి చేరుకున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మజీ మంత్రి కామినేని శ్రీనివాసరావులను అక్కడే హౌస్ అరెస్టు చేశారు. రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజుకి పోలీసులు 151 నోటీసు అందజేశారు.
నెల్లిమర్ల – రామతీర్థం ramatheertham జంక్షన్ లో బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు బీజెపీ, జనసేన నేతలను అడ్డుకున్నారు. అయనప్పటికీ బీజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు somu veerrajuతో సహా బీజెపీ, జనసేన నాయకులు పోలీసు వలయాలను ఛేదించుకుని ముందుకు వెళ్లారు. తీవ్ర తోపులాటలో సోము వీర్రాజు కింద పడ్డారు. నెల్లిమర్ల వద్ద సోము వీర్రాజు somu veerraju తో సహా బిజెపీ bjp, జనసేన janasena నేతలు, కార్యకర్తలను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యాన్ ఎక్కించి తరలించారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం జగన్మోహనరెడ్డికి చిత్తశుద్ది ఉంటే హిందూ ఆలయాలపై దాడులను నియంత్రించాలని సోము డిమాండ్ చేశారు. ఈ ఘటనలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడులకు నైతిక బాధ్యత వహించి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ ఘటనలను టీడీపీ రాజకీయ కోణంలో చూస్తుందని ఆరోపిస్తూ తాము హిందువుల మనోభావాల కోసం పోరాడుతున్నామని సోము వీర్రాజు అన్నారు.