ఏపి రాజధాని అమరావతి లో జరిగిన మాస్టర్ ప్లాన్ అవకతవకలపై సీఐడీ దూకుడు పెంచింది. హైదరాబాద్ లో నిన్న మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసాల్లో దాడులు నిర్వహించిన సీఐడీ అధికారులు నేడు ఆయన నివాసంలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. నారాయణపై పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న నేపథ్యంలో ఏ కేసులో సోదాలు జరుగుతున్నాయనే అనుమానాలను నివృత్తి చేసేందుకు నిన్ననే సీఐడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాజధాని మాస్టర్ ప్లాన్ అవకతవకల పైనే సోదాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కూకట్ పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్ ఉన్న నారాయణ కుటుంబీకుల నివాసాల్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కుటుంబీకుల బ్యాంక్ స్టేట్ మెంట్ ను పరిశీలన చేస్తూ పలు లావాదేవీల గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తొంది. ఈ రోజు సాయంత్రం వరకూ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.
టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణపై ఏపీ సీఐడీ పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. అమరావతి భూముల కొనుగోలు, రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కామ్ కేసు తో పాటు పదో తరగతి పరీక్షా పత్రం లీకేజీ కేసులు ఆయనపై ఉన్నాయి. ఆ కేసుల దర్యాప్తులో భాగంగా ఏపీ సీఐడీ అధికారులు పలు మార్లు నారాయణ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. తాజాగా ఇప్పుడు మరో మారు ఆయన కుమార్తె నివాసంతో పాటు ఆయన నివాసాల్లో సోదాలు జరుపుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
వైఎస్ వివేకా హత్య కేసుపై సజ్జల సంచలన కామెంట్స్ .. జగన్ పై చంద్రబాబు కుట్రలు అంటూ..