కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పండుగలు, పర్వదినాల్లో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భాల్లో వివిధ రకాల సేవలను రద్దు చేస్తుంటారు. మార్చి 3వ తేదీ నుండి 7వ తేదీ వరకూ శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకూ పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
తెప్పోత్సవాల్లో భాగంగా తొలి రోజు మార్చి 3న శ్రీసీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు పుష్కరిణిలో మూడు సార్లు విహరించి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు మార్చి 4న రుక్మిణి సమేత శ్రీకృష్ణుడు అవతారంలో మూడు సార్లు పుష్కరిణిలో తిరుగుతారు. ఇక మూడవ రోజు మార్చి 5న శ్రీభూ సమేత మలయప్ప స్వామివారు మూడు సార్లు పుష్కరిణిలో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
ఇదే విధంగా శ్రీమలయ్య స్వామివారు నాల్గవ రోజు మార్చి 6వ తేదీన అయిదు సార్లు, చివరి రోజు మార్చి 7న ఏడు సార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులకు కనువిందు చేస్తారు. అయితే ఈ తెప్పోత్సవాల కారణంగా పలు సేవలను రద్దు చేశారు. మార్చి 3,4 తేదీల్లో తోమాల సేవ, అర్చన, సహస్ర దీపాలంకరణ సేవ, మార్చి 5, 6 తేదీల్లో తోమాల సేవ, అర్చన, అర్జిత బ్రహోత్సవం. సహస్ర దీపాలంకరణ సేవ, మార్చి 7న ఆర్జిత బ్రహోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసింది టీటీడీ.
YS Viveka Murder Case: వైఎస్ అవినాష్ రెడ్డికి షాక్ ఇచ్చిన సీబీఐ