CM YS Jagan: మాండూస్ తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య తదితర జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర తుఫానుగా మాండూస్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో సారి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభావిత ప్రాంతాలు, భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృషి పెట్టాలని అధికారులను ఆదేశించారు, సీఎం జగన్.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల కలెక్టర్ లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే పునరావాస కేంద్రాలను తెరిచి వారికి అన్ని రకాలుగా అండగా ఉండాలని తెలిపారు. మాండూస్ తుఫాను ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాతో పాటు పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.