NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

AP CM YS Jagan: వారికి భరోసా ఇచ్చిన ఏపి సీఎం జగన్..!!

AP CM YS Jagan: రాష్ట్రంలో నూతన విద్యా విధానం తీసుకువస్తే అంగన్ వాడీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని అందోళన వ్యక్తం అవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ వర్గాలకు భరోసా ఇచ్చారు. స్కూళ్లు, అంగన్ వాడీల్లో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం లేదని, ఒక్క కేంద్రం కూడా మూసివేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాల మేలు కోసమే నూతన విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని, ఇదే విషయాన్ని తెలియజెప్పాలని జగన్ అధికారులకు సూచించారు.

AP CM YS Jagan review on nadu nedu
AP CM YS Jagan review on nadu nedu

విద్యాశాఖ, అంగన్ వాడీల్లో నాడు – నేడు పై సీఎం వైఎస్ జగన్ గురువారం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానంపై సీఎం జగన్ సమీక్ష జరిపి దీని అమలు కోసం కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, దీని కోసం అయ్యే ఖర్చుతో వివరాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు జరుగుతుందనీ, ఇప్పటి వారిక కాకుండా తర్వాత తరాలకు విశేష ప్రయోజనం కలుగుతుందన్నారు. నూతన విద్యావిధానంపై అపోహాలను తొలగించి జరిగే మేలును గురించి వివరించాలని సూచించారు. మండలానికి ఒకటి లేదా రెండు జూనియర్ కళాశాలలు ఉండాలని స్పష్టం చేసిన జగన్ ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు – నేడు కింద భూమి కొనుగోలు చేయాలని ఆదేశించారు. అదే విధంగా వచ్చే ఏడాది నుండి విద్యా కానుకలో అదనంగా స్పోర్ట్స్ దుస్తులు, షూ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

Read More: Ashok Gajapati Raju: విజయసాయి వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెప్పిన అశోక్ గజపతిరాజు..!!

రాష్ట్రంలో రెండు రకాల పాఠశాలలు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పిపి -1 లో 1,2 తరగతులకు కిలో మీటరు లోపు పాఠశాల ఉండాలన్నారు. పిపి -2 లో 3 -10 తరగతులకు మూడు కిలో మీటర్ల లోపు హైస్కూల్ పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఒకే ఉపాధ్యాయుడు అన్ని పాఠ్యాంశాలు బోదించే విధానం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. జూలై 1 నుండి రెండో దశ నాడు – నేడు ప్రారంభించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

ఐసీడీఎస్ లక్ష్యానికి విరుద్ధంగా రాష్ట్రంలో నూతన విద్యా విధానం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిందనీ, దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అంగన్ వాడీ ఆయాలు, వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సీఎం జగన్ నేడు క్లారిటీ ఇచ్చారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N