NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP SEC: నెల్లూరు కార్పోరేషన్ సహా 12 మున్సిపాలిటీల ఎన్నికలకు షెడ్యుల్ విడుదల చేసిన ఎస్ఈసీ

AP SEC: ఏపిలో బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ రెండు క్రితం జరిగిన సంగతి తెలిసిందే. రేపు కౌంటింగ్ జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల కాక తగ్గకమునుపే రాష్ట్రంలో మరో ఎన్నికల నగరా మోగింది. నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నేడు షెడ్యుల్ విడుదల చేసింది. ఈ నెల 3వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. 15వ తేదీ పోలింగ్, 17వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు.,

AP SEC says remaining municipal elections notification on November 3rd
AP SEC says remaining municipal elections notification on November 3rd

 

AP SEC: 13 మున్సిపాలిటీల్లో 15 న పోలింగ్

నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లా లోని గురజాల, దాచేపల్లి, ప్రకాశం జిల్లా దర్శి, చిత్తూరు జిల్లా కుప్పం, కర్నూలు జిల్లా బేతంచెర్ల, వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం, రాజంపేట, అనంతపురం జిల్లా పెనుగొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో 15వ తేదీ పోలింగ్ జరగనున్నది. అదే విధంగా 498 పంచాయతీల్లో 69 సర్పంచులకు ఈ నెల 14న ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరగనుంది. 13 జిల్లాల్లో మిగిలిన 187 ఎంపీటీసీలు, 16 జడ్పీటీసీ లకు ఈ నెల 16న పోలింగ్ నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి 18న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు.  ఈ మేరకు ఎస్ఈసీ షెడ్యుల్ విడుదల చేసింది.

 

29న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

మరో పక్క ఏపి, తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు రెండు రోజుల క్రితం ఈసీ షెడ్యుల్ విడుదల చేసింది. ఏపిలో మూడు, తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసింది. ఈ నెల 9న వీటికి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 29న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఏపిలో మే 31 ముగ్గురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. తెలంగాణలో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3న ముగిసింది. ఈ స్థానాలకు గతంలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది ఈసీ. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఈసీ షెడ్యుల్ విడుదల చేసింది. ఏపి అసెంబ్లీలో వైసీపీకి, తెలంగాణ అసెంబ్లీ లో టీఆర్ఎస్ కు మెజార్టీ ఎమ్మెల్యేలు ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్ధుల ఎన్నిక లాంఛన ప్రాయమే అవ్వనుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N