AP SSC Results 2023: ఏపి పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుండి 18వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించగా, 6,05,052 మంది విద్యార్ధులు హజరైయ్యారు. పరీక్షలు రాసిన వారిలో 72.26 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణులు అయ్యారు. ఏపి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. బాలుర పాస్ పర్సెంటేజ్ 69.27 శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 75.38 గా ఉంది. స్పాట్ వ్యాల్యుయేషన్ ఏప్రిల్ 19 నుండి 26వ తేదీ వరకూ అంటే కేవలం 8 రోజుల్లోనే స్పాట్ వాల్యూయేషన్ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. రికార్డు స్థాయిలో తక్కువ రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు మంత్రి బొత్స.
గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. ఈ సారి కూడా బాలుర కంటే బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులు అయ్యారు. 87.45 శాతం ఉత్తీర్ణతతో పార్వతీ పురం మన్యం జిల్లా రాష్ట్రంలో ప్రధన స్థానం నిలవగా, 60.39 శాతం ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది. రాష్ట్రంలోని 933 స్కూళ్లల్లో వంద శాతం మంది విద్యార్ధులు పాస్ అయ్యారు. అయితే 38 పాఠశాలలో సున్నా శాతం ఫలితాలు నమోదు కావడం ఆందోళన కల్గిస్తొంది. పరీక్షల నిర్వహణ నుండి ఫలితాల ప్రకటన వరకూ పకడ్బందీ గా చర్యలు తీసుకుంది విద్యాశాఖ. సీబీఎస్ఈ తరహాలో ఆరు సబ్జెక్ట్ లకే టెన్త్ పరీక్షలు నిర్వహించింది ఎస్ఎస్సీ బోర్డు. ఇక టెన్త్ ఫలితాల కొరకు https://bse.ap.gov.in/ క్లిక్ చేసి హాట్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేసి చూసుకోవచ్చు.