IRR Case: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఐఆర్ఆర్ కేసులో నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసు జారీ చేసి లోకేష్ ను సీఐడీ విచారించింది. అయితే తాజాగా 41ఏ నోటీసులు ఉలంఘించినందున చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ ముందుగా ఏసీబీ కోర్టులో మెమో జారీ చేసింది.
సీఆర్పీసీ 41 ఏ నిబంధనలను లోకేష్ ఉల్లంఘించారని, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయనపై చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాది కోరారు. ఈ నేపథ్యంలో 41 ఏ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రశ్నించగా, లోకేష్ వ్యాఖ్యలకు సంబంధించి పత్రికలో వచ్చిన కథనాన్ని కోర్టుకు అందించారు. దీనిపై ప్రస్తుతం రెగ్యులర్ కేసులు ఉన్నందున ఇవి ముగిసిన తర్వాత ఈ మెమో పై విచారణ చేయాలా వద్ద అని నిర్ణయిస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలియజేసి, మెమోను పక్కన పెట్టారు.
ఆ తర్వాతే దీనిపై హైకోర్టులో మెమో జారీ జారీ చేసారు సీఐడీ తరుపు న్యాయవాది. 41 ఏ నోటీసు నిబంధనలు ఉల్లంఘించినందున లోకేష్ పై చర్యలకు అనుమతి ఇవ్వాలని సీఐడీ హైకోర్టులో కోరింది. రెడ్ బుక్ పేరుతో అధికారులును లోకేష్ బెదిరిస్తున్నారనీ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారని సీఐడీ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తున్న ఆయన తరుపు న్యాయవాదులు, టీడీపీ తరపు న్యాయవాదులు లోకేష్ అరెస్టునకు మెమో జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేష్ 41 ఏ నోటీసుల ఉల్లంఘనకు పాల్పడలేదని విన్నవించారు. ఈ పిటిషన్ పై విచారణ ను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల లోకేష్ పేరు 14 నిందితుడుగా ఉండగా, గతంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో లోకేష్ ను అరెస్టు చేయడం లేదనీ, 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామని తెలియజేయడంతో హైకోర్టు లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఆ తర్వాత లోకేష్ కు సీఐడీ నోటీసులు జారీ చేసి రెండు రోజుల పాటు విచారణ చేసింది. అయితే నారా లోకేష్ తన ప్రసంగాల్లో రెడ్ బుక్ లో పేర్లు రాస్తున్నాననీ, వారిపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. ఇలా హెచ్చరిస్తూ అధికారులను లోకేష్ బెదిరిస్తున్నారని సీఐడీ కోర్టుకు నివేదించింది.
AP Politics: బీజేపీపై ఆశలు వదులుకున్న టీడీపీ – జనసేన .. కీలక నిర్ణయం దిశగా బీజేపీ..?