YS Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవాక్కయేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలను తీసుకున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు కు దెబ్బ కొట్టేలా… అగ్రకులాల కోసం సంక్షేమం- అభివృద్ధి కార్పొరేషన్లను వైసీపీ సర్కార్ ఏర్పాటు చేసింది. పక్కా లెక్కలు చూసుకొని రెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు కమ్మ కులస్తులకు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. రెడ్డి కులస్తులు, క్షత్రియుల కోసం వేర్వేరుగా మూడు కార్పొరేషన్లను నెలకొల్పుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
లెక్కలు అన్నీ చూసుకున్న జగన్
ఏపీలో రెడ్డి సామాజిక వర్గం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజికవర్గం అండగా ఉంటూ వస్తోంది. అయితే, ఈ లెక్కలకు కొత్త సమీకరణలు సెట్ చేస్తున్న ఏపీ సీఎం జగన్ తన వైసీపీ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే అదే సమయంలో ప్రత్యర్థుల ఓటు బ్యాంకు దెబ్బ కొట్టేందుకు పక్కా ప్లాన్ వేశారు.
మూడు కార్పొరేషన్లతో…
తన పార్టీల బలం మరింత పెంచుకోవడం ప్రత్యర్థి పార్టీలకు షాక్ ఇవ్వడంలో భాగంగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతనంగా ఏర్పాటు చేసి ఈ మూడు కార్పొరేషన్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేయనున్నట్లు ఆదేశాల్లో వెల్లడించారు. ఈ మూడు సామాజిక వర్గాల్లో ఆర్థికంగా వెనుక బడినవారికి చేయూత ఇవ్వటమే వీటి ఏర్పాటు వెనుక లక్ష్యమని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. కాగా, ఏపీ సీఎం నిర్ణయం విపక్షాలకు ఊహించని షాక్ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.