NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Amaravati: మూడు రాజధానుల అంశంపై బీజేపీ ఎంపీ జీవిఎల్ కీలక వ్యాఖ్యలు

Amaravati: బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహారావు మూడు రాజధానుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రాంతంలో శనివారం ఆయన పర్యటించి టిడ్కో ఇళ్లు, ఎస్ఆర్ఎం, విట్, ఎన్ ఐ డీ కాలేజీలను నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రాజధానులు అనేది వైసీపీ రాజకీయ ఎత్తుగడే అని విమర్శించారు. హైకో్ర్టు తీర్పు అమల్లో ఉండగా మూడు రాజధానులు అంటే తీర్పును దిక్కరించినట్లేనని అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు అప్పీలుకు వెళ్లలేదన్నారు. మూడు రాజధానులు సాధ్యం కాదని జగన్ కు అర్ధమైపోయిందని లేదంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం చేసే వారని అన్నారు.

BJP mp gvl comments on amaravati capital
BJP mp gvl comments on amaravati capital

Amaravati: అభివృద్ధి పనుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి

రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తోందని జీవిఎల్ విమర్శించారు. జగన్ ప్రభుత్వం పనులు చేయకుండా అభివృద్ధిని అటకెక్కించిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం కూడా అసమర్ధత వల్ల పనులు చేయలేదని అన్నారు. ఇదే అదనుగా జగన్ రాజధాని నిర్మాణ పనులు నిలిపివేశారన్నారు. అమరావతి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయా సంస్థలకు తాను లేఖ రాసినట్లు చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధి పనుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని జీవిఎల్ సూచించారు. రాజకీయాల కోసం అమరావతిని బలి చేయవద్దని ఎంపి అన్నారు.

పూర్తి సామర్ధ్యం మేరకు కేంద్రం ఏపికి సాయం

అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని బీజేపీ గతంలోనే తీర్మానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి కనీస వసతులు కల్పిస్తే అమరావతి అభివృద్ధి చెందుతుందని అన్నారు జీవిఎల్. ప్రముఖ సంస్థలు రాజధానికి రావాలంటే మౌలిక సదుపాయలు ముఖ్యమని పేర్కొన్నారు. ఇప్పటికే నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ పూర్తవుతోందన్నారు. కేంద్రం పూర్తి సామర్ధ్యం మేరకు ఏపికి సాయం చేస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు సాకుగా చూపిి రాజధానిలో అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మూడు రాజధానులపై బిల్లు తీసుకువచ్చే ప్రసక్తి లేదని జీవీఎల్ స్పష్టం చేశారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N