Breaking: ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యవసాయ కార్మికులతో పాటు మరో వ్యక్తి మృతి చెందగా మరో పది మంది కూలీలు గాయపడ్డారు. ఎర్రగొండపాలెం మండలం కొత్తపల్లి సమీపంలో ఆటోను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఎర్రగొండపాలెం ఆసుపత్రికి తరలించారు. మొగుళ్లపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు మిర్చి కోతలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో ఆటోలో వెళుతున్న కూలీల్లో ఇద్దరు, కారులో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని బావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు.