తెలంగాణ సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ పై కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ నగరంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న మహిళా ఉద్యోగిని వేధిండాన్న ఆరోపణలపై ఎస్పీ కిషన్ సింగ్ పై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ కిషన్ సింగ్ తన ఫోన్ కు అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు పంపించి వేధిస్తున్నారని ఆ మహిళ ఆరోపించారు.
ఆయన వేధింపులు తట్టుకోలేక సదరు మహిళా ఉద్యోగి పోలీసులను ఆశ్రయించింది. దీంతో చైతన్య పురి పోలీసులు ఆమె ఫిర్యాదుపై సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీస్ అధికారిపైనే కేసు నమోదు కావడం హైదరాబాద్ లో హాట్ టాపిక్ అయ్యింది.
పీఎస్ఎల్వీ సీ – 56 రాకెట్ ప్రయోగం విజయవంతం .. ఇస్రో బృందానికి సీఎం జగన్ శుభాకాంక్షలు