Veeravasaram : ఎవరికి అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్ కి వెళ్లి పిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుందని భావిస్తుంటారు. అటువంటిది పోలీస్ స్టేషన్ లోనే అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలి. పోలీస్ స్టేషన్ లో అయితే భద్రంగా ఉంటుందని దాచిన నగదు మాయం అవ్వడం పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలాన్ని రేపుతోంది. ఒకటి కాదు రెండు రూ.8 లక్షలు పోలీస్ స్టేషన్ నుండి మాయం అయిన ఘటన వీరవాసరం పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే గత రెండు రోజులుగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె, అంతకు ముందు రెండవ శనివారం, ఆదివారం సెలవు కావడంతో నాలుగు రోజల నుండి ప్రభుత్వం మద్యం దుకాణాల్లో అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును సేఫ్టీ కోసం పోలీస్ స్టేషన్ లాకర్లో ఉంచారు. బుధవారం నగదును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వైన్ షాపు సిబ్బంది పోలీస్ స్టేషన్ కు రాగా లాకర్ లో పెట్టిన నగదు కనిపించకపోవడంతో ఖంగుతిన్నారు. నగదు మాయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.