Chandrababu Arrest: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు గత శనివారం నంద్యాలలో అరెస్టు చేసి మరుసటి రోజు ఉదయం ఏసీబీ కోర్టులో హజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు. అయితే చంద్రబాబును విచారించేందుకు అయిదు రోజులు కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టులో నిన్న విచారణ జరిగింది.
సీఐడీ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ప్రత్యేక పీపీ వివేకానంద, చంద్రబాబు తరపున సిద్ధార్ధ లూథ్రా, సిద్ధార్ధ అగర్వాల్ వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనల అనంతరం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి .. చంద్రబాబు కస్టడీపై ఉత్తర్వులను ఈ రోజు (గురువారం) వెల్లడిస్తామని ప్రకటించారు. దీంతో ఈ ఉదయం చంద్రబాబు కస్టడీపై తీర్పు వెలువడుతుందని భావించారు. ఈ అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొనగా ఈ రోజు సాయంత్రం తీర్పు వెలువడుతుందని సమాచారం తెలిసింది. అయితే చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉన్న దృష్ట్యా తీర్పును శుక్రవారానికి వాయిదా వేసినట్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు.
శుక్రవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ అయితే తీర్పు వాయిదా వేస్తామని, క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి తెలిపారు. దీంతో చంద్రబాబు కస్టడీపై తీర్పు ఎలా ఉంటుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా అమరావతి రింగ్ రోడ్డ్ అలైన్ మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసుల్లో సీఐడీ వేసిన పీటీ వారెంట్లపై శుక్రవారం విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు తెలిపింది.
RK Roja: బావ కళ్లలో ఆనందం చూడటం కోసమే బాలయ్య ఫీట్లు అంటూ మంత్రి రోజా సెటైర్లు