Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మొత్తం 14 మంది సభ్యులు ఎంట్రీ ఇస్తే ప్రస్తుతం హౌస్ లో 12 మంది ఉన్నారు. రెండు వారాలకి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొదటివారం కిరణ్ రాథోడ్ రెండో వారం షకీలా ఎలిమినేట్ కావడం జరిగింది. మూడో వారం ఎలిమినేషన్ లో మొత్తం ఏడుగురు ఉన్నారు. అయితే ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ హౌస్ నుండి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హౌస్ లో పవరస్త్రానికి సంబంధించి.. ఇంటి సభ్యులకు బిగ్ బాస్ రకరకాల టాస్కులు పెడుతూ ఉన్నారు. మూడవ వారం పవర్ అస్త్రాకి సంబంధించి హౌస్ లో ఇంటి సభ్యులు ఎవరికివారు గెలవడానికి తెగ తాపత్రయ పడుతున్నారు.
ఈ క్రమంలో మొదట ప్రిన్స్, శోభా శెట్టి, అమరదీప్ లను స్వయంగా బిగ్ బాస్ సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ముగ్గురిలో మొదట ప్రిన్స్ యావర్ అనర్హుడు అని మెజారిటీ సభ్యులు.. సీక్రెట్ రూమ్ లో తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఆ తర్వాత అమరదీప్, ప్రియాంక, శోబా శెట్టి ల మధ్య…ఈ మూడో పవర్ ఆస్త్రకి సంబంధించి టాస్క్ జరిగింది. అయితే ఈ టాస్క్ లో గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, పల్లవి ప్రశాంత్.. శోభ శెట్టి అనర్హురాలని ముక్తకంఠంతో చెప్పారు. అంత మాత్రమే కాదు తనను అనర్హురాలు అనిపించుకునేందుకు బిగ్ బాస్ శోభా శెట్టికి కారంగా ఉన్న చికెన్ తినాలని టాస్క్ ఇచ్చాడు.
అది తినలేక శోభా బోరున ఏడుస్తూ రక్త కన్నీరు వచ్చేటట్టు మంట ఉన్నట్లు ఫీలింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఇదే సమయంలో శోభ అనర్హురాలు అని చెప్పిన మిగతా ముగ్గురికి కూడా ఆకారం ఉన్న చికెన్ తినాలని బిగ్ బాస్ ఆదేశాలు జారీ చేయడం జరుగుద్ది. గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, పల్లవి ప్రశాంత్… కారం తినాలని ప్రయత్నాలు చేయగా తినలేక మధ్యలోనే వెళ్లిపోతారు. మొత్తానికి హౌస్ లో కారం చికెన్ తినిపించి కంటెస్టెంట్లకు కంటి నుండి బిగ్ బాస్ నీళ్లు తెప్పించాడు.