Nindu Noorella Savasam September 20th: నిండు నూరెళ్ళ సవాసం జీ5 లో ప్రసారమయ్యే తెలుగు టీవీ సీరియల్. నలుగురు పిల్లల ప్రేమగల తల్లి, మేజర్ అమరేంద్ర భార్య అరుంధతి కథ చుట్టూ ఇది తిరుగుతుంది. అరుంధతి ఆకస్మిక మరణం ఆమె కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది, మరియు ఈ ప్రదర్శన అరుంధతి స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పిల్లల సంరక్షకురాలు భాగమతి యొక్క ప్రయాణాన్ని అనుసరిస్తుంది.
ఈ సీరియల్ లో మేజర్ అమరేంద్ర వర్మ గా రిచర్డ్ జోస్, అరుంధతి గా పల్లవి గౌడ, భాగమతి పాత్ర లో నిసర్గ మరియు మనోహరి పాత్రలో మహేశ్వరి నటించారు. నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ లో మహేశ్వరీ కి కూడా మంచి పేరు వచ్చింది.
మహేశ్వరీ ఎవరు అని తెలుగు TV సీరియల్స్ చూసే వారందరికీ తెలుసు. ఇంకా గుర్తుకి రాలేదా అయితే వదినమ్మ సీరియల్ చూసారా అందులో శైలు పాత్ర వేసింది నటి మహేశ్వరీ . ఈమె హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు. ఇంటర్ వరకు చదివి తర్వాత ఫాషన్ డిజైన్ కోర్స్ కూడా చేశారు. తర్వాత HMTV లో యాంకర్ లిటిల్ స్టార్స్ అనే ప్రోగ్రాం లో పని చేసింది. అప్పుడు ఈమె కి అన్నా చెల్లెలు అనే సీరియల్ లో అవకాశం వచ్చింది.
ఈమె ఇప్పటికి 20 పైగా సీరియల్స్ లో అన్ని ఛానెల్స్ లోనూ నటించారు. ఈమె అక్టోబర్ 7 న హైదరాబాద్ లో పుట్టారు. ఈమె కు శివనాగ్ తో పెళ్లి అయింది. శివ నాగ్ నేషనల్ రురల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ లో డిసైనర్ గ ఉన్నారు.
శివ నాగ్ ఇదివరలో అసిస్టెంట్ డిఏక్టర్గా టాలీవుడ్ లో పని చేశారు. పూరి జగన్నాథ్ మరియు రామ్ గోపాల్ వర్మ ల వద్ద పని చేసారు. మహేశ్వరీ, శివనాగ్ దంపతులకు ఒక అందమైన పాప ఉంది. ఆ పాపా పేరు హరిణి. వీరు పెద్దలకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిది పేస్ బుక్ పరిచయం, ఆలా అలా ప్రేమ గా తర్వాత పెళ్ళికి దారితీసింది. మహేశ్వరీ నటించిన వదినమ్మ సీరియల్ ఏడాది పైనించి నడుస్తోంది. శివ నాగ్ పుట్టిన రోజున ఇంస్టాగ్రామ్ లో పుట్టిన రోజు శుభాకాంక్షలు పోస్ట్ చేసింది