Chandrababu : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఊహించని షాక్ కు గురయ్యేలా ఏపీలో పంచాయతీ మూడో దశ ఎన్నికల ఫలితాల్లో సొంత ఇలాకా అయిన కుప్పంలో పార్టీ ఘోరంగా ఓటమి పాలయింది.
కుప్పంలో టీడీపీ మద్దతుదారుల ఓటమిపై స్పందించిన చంద్రబాబు…కుప్పంలో వైసీపీ ఉన్మాదం గెలిచి, ప్రజాస్వామ్యం ఓడిపోయిందన్నారు. దానికి తాను రాజీనామా ఎందుకు చేయాలంటూ ఎదురు ప్రశ్నించారు. అయితే, కుప్పంలో ఓటమి కంటే మరింత పరువుపోయే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు అంటున్నారు. అదే బెజవాడ ఘటనలు.
Chandrababu బెజవాడలో ఏం జరుగుతోందంటే….
టీడీపీకి పట్టున్న విజయవాడలో ఆ పార్టీ విబేధాలు రచ్చకెక్కాయి. కార్పొరేషన్ ఎన్నికల వేళ టీడీపీలో విబేధాలు బయటపడ్డాయి. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. వన్ టౌన్ నాలుగు స్తంభాల సెంటర్ లో డివిజన్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ నానిని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గీయులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. దీంతో పార్టీ పరువు గంగపాలు అయింది.
అసలు రచ్చ ఏంటి?
విజయవాడ మేయర్ అభ్యర్థి విషయంలో టీడీపీలో వార్ మొదలైంది. మేయర్ అభ్యర్థి విషయంలో చంద్రబాబు ఇంకా ఎవరి పేరు ఫైనల్ చేయలేదు. దీంతో గందరగోళం కొనసాగుతోంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థికి ఇచ్చారని.. ఈసారి సెంట్రల్ నియోజకవర్గానికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మరోవైపు ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత మేయర్ అభ్యర్థి అని ప్రచారం జరుగుతుండగా.. ఇంకా ఎవరి పేరు డిక్లేర్ చేయలేదని వ్యతిరేక వర్గం అంటోంది. ఈ రచ్చ కాస్త ఇలా నేతలు కామెంట్లు చేసుకునే స్థాయికి చేరిపోయింది. ఈ ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం గమనార్హం.