Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఏపీ సీఐడీ అరెస్టు చేసి నెలరోజులు దాటింది. గత నెల 9వ తేదీన నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసి మరుసటి రోజు విజయవాడ ఏసీబీ కోర్టులో హజరుపర్చారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి రిమాండ్ ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు. గత 34 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే అండర్ ట్రైల్ ఖైదీగా చంద్రబాబు ఉన్నారు. ఆయన బెయిల్ ప్రయత్నాలు ఇప్పటి వరకూ ఫలించలేదు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కూడా ఏపీ హైకోర్టు డిస్మిస్ చేయడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
నెల రోజులకుపైగా రోజులుగా పార్టీ అధినేత చంద్రబాబు జైలులో ఉండటంతో పార్టీ క్యాడర్ లో నిరుత్సాహలో ఉంది. నాలుగు దశాబ్దాల చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇలాంటి విపత్కర పరిస్థితి చంద్రబాబు ఎప్పుడూ చవి చూడలేదు. తొలి సారిగా ఆయన జైలు గోడల మధ్య నెల రోజులకుపైగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ఇన్ని రోజుల పాటు జైలులో ఉంటారని ఎవరూ ఊహించలేదు. అరెస్టు అయిన వెంటనే బెయిల్ పై బయటకు వస్తారని టీడీపీ శ్రేణులు ఆశించారు. అయితే వారి అంచనాలు తల్లకిందులైయ్యాయి. అరెస్టు అయిన వెంటనే బెయిల్ ప్రయత్నాలు ప్రారంభించి ఉంటే ఈ పాటికి బెయిల్ వచ్చేదనీ, కానీ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఎఫ్ఐఆర్ క్వాష్ కోసం ప్రయత్నాలు ప్రారంభించడం వల్లనే ఇంత ఆలస్యం జరిగిందని అంటున్నారు.
ఇక ఈ రోజు అక్టోబర్ 13 (శుక్రవారం) చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులకు అత్యంత కీలకంగా కానుంది. హైకోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లపై నేడు విచారణలు, తీర్పులు వెలువడనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ తన పై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని సుప్రీం కోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై శుక్రవారం (ఇవేళ) విచారణ జరగనుంది. ఇంతకు ముందు విచారణ సమయంలో చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఇవేళ ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. అవినీతి నిరోధక చట్టం 17ఏ చంద్రబాబు కేసులో వర్తిస్తుందా లేదా అన్న దానిపైనే సుదీర్ఘంగా వాదనలు జరుగుతున్నాయి.
మరో పక్క ఫైబర్ గ్రిడ్ కేసులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 9న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరుపుతున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందుకే ఇవేళ ఈ పిటిషన్ విచారణకు రానుంది. ఫైబర్ గ్రిడ్ కేసులో దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులోనూ 17 ఏ వర్తిస్తుందని దాని ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోలేదని చంద్రబాబు పిటిషన్ లో వివరించారు.
అలానే హైకోర్టులో అంగళ్లు ఘటనకు సంబంధించి చంద్రబాబుపై నమోదైన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవేళ తీర్పు రానుంది. ఇప్పటికే హైకోర్టులో ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు ముగియగా హైకోర్టు న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. ఇవేళ తీర్పు రానున్నంది. దీంతో అందరి చూపు ఇటు హైకోర్టు, అటు సుప్రీం కోర్టుపై ఉంది. చంద్రబాబు కేసులో ఎలాంటి తీర్పులు వెలువడనున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
YS Jagan: సీఎం జగన్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ