ఎన్డీఏ రాాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము తన షెడ్యుల్ ప్రకారం ఈ రోజు ఏపి, తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తొంది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ద్రౌపది ముర్ము మంగళవారం ఏపి పర్యటన అనంతరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో ముర్ము ప్రచారం ఇంకా పూర్తి కాని నేపథ్యంలో సమయాభావం వల్ల ఆమె తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల 16వ తేదీ ఢిల్లీలో ద్రౌపది ముర్ము పాల్గొననున్న బీజేపీ ఎంపీల సమావేశానికి తెలంగాణకు చెందిన అయిదుగురు ఎంపీలకు ఇప్పటికే అహ్వానం అందింది. తెలంగాణ నుండి కేవలం అయిదుగురు పార్లమెంట్ సభ్యులు, ముగ్గురు ఎమ్మెల్యేలు మత్రమే ఉండటం కూడా ఈ పర్యటన రద్దుకు ఒక కారణంగా తెలుస్తొంది. మరో పక్క టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాల మూలంగా ఎవరైనా ఎన్డీఏ అభ్యర్ధికి క్రాస్ ఓటింగ్ చేస్తే అది బోనస్ అవుతుందని అంటున్నారు. ఇక ఏపి పర్యటన విషయానికి వస్తే..
రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ప్రత్యేక విమానంలో 1.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. బీజేపీ దాని మిత్ర పక్షాల నేతలు రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. ఆమె తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రానున్నారు. విమానాశ్రయ ప్రాంగణంలో సంప్రదాయ గిరిజన నృత్యాలతో ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర బీజేపీ ఏర్పాట్లు చేసింది. ఆ తరువాత మంగళగిరి సమీపంలోని సికే కన్వెన్షన్ హాలులో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం వైఎస్ జగన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ద్రౌపది ముర్ము సీకే కన్వెన్షన్ హాలు వద్ద సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలకనున్నారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిర్వహించే ఈ సమావేశంలో ద్రౌపది ముర్ము కు స్వాగతం పలుకుతూ వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ప్రసంగిస్తారు. తొలి సారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు రాష్ట్రపతి అభ్యర్ధిగా అవకాశం కల్పించడాన్ని వైసీపీ స్వాగతించింది. ఈ సమావేశంలో వైఎస్ జగన్, ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.
బీజేపీ నేత సత్యకుమార్ గాలి తీసేసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. మ్యాటర్ ఏమిటంటే..?