ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్స్ వాడకం బాగా ఎక్కువైంది.చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మొబైల్ కు బానిసలు అయిపోయారు అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.ఫోన్ అనేది మానవుని జీవితంలో ఒక నిత్యవసర వస్తువులాగా మారిపోయింది. ఏ పని చేయాలన్నాగాని ఫోన్ తప్పనిసరి అయిపొయింది. తినే ఆహారం దగ్గర నుండి ఇంట్లోకి అవసరం అయిన చిన్నా చితకా వస్తువుల వరకు ఫోన్ లో. ఆర్డర్ ఇచ్చేసి నేరుగా ఇంటికి రప్పించేసుకుంటున్నారు. ఇక చిన్నపిల్లలు విషయం అయితే చెప్పనవసరం లేదు..మొబైల్స్ లో వీడియోలు చూడడానికి,ఆటలు ఆడడానికి బాగా బానిసలుగా అయిపోయారు. ఫోన్ ఇస్తేనే అన్నం తింటాను అని పేరెంట్స్ ని బ్లాక్ మెయిల్ చేయడం,ఫోన్ ఇవ్వలేదని ఆత్మ హత్యలు చేసుకోవడం వంటి ఘటనలను ఈ మధ్య కాలంలో మనం చాలానే చూసాం.
వాకింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ చూస్తున్నారా..!? ఎంత ప్రమాదమో చూడండి..!!
ఫోన్ వాడితే వచ్చే అనారోగ్యాలు :
చాలా మంది అదేదో గొప్ప పనిలా రెండు, మూడు మొబైల్స్ ను జేబులో పెట్టుకొని తిరుగుతుంటారు.ఇలా ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వలన చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హేచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తలనొప్పి సమస్య వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మొబైల్ వాడకం వలన తలనొప్పి ఎలా వస్తుంది అనే డౌట్ మీకు గలగవచ్చు. నిజానికి మొబైల్ అతిగా వాడితే రెండు రకాలుగా తలనొప్పి వస్తుందట. ఒకటి రేడియో ఫ్రీక్వెన్సీ వలన వస్తే మరొకటి రేడియేషన్ వలన వస్తుంది.
రేడియో ఫ్రీక్వెన్సీ వలన వచ్చే తలనొప్పి :
ఈ ఫ్రీక్వెన్సీ అనేది మనం ఎక్కువగా మొబైల్స్ లో ఇంటర్నెట్ వాడినప్పుడు వస్తుంది.అయితే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ప్రభావం ఎక్కువగా బ్రెయిన్ మీద చూపిస్తుంది. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది నేరుగా బ్రెయిన్ కణాల మీద పడి మెదడులోని కణాలను ఎక్కువగా వేడి అయ్యేలా చేస్తుంది. ఫలితంగా మనకు ఎక్కువగా ఆవలింతలు రావటం, ఒత్తిడికు గురవ్వడం, నొప్పిగా, అసౌకర్యంగా ఉండటం, తలనొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
రేడియషన్ :
మొబైల్స్ ఎక్కువగా వాడినప్పుడు వాటి నుండి వెలువడే రేడియేషన్ వలన మనకు తలనొప్పి. వస్తుంది. రేడియషన్ ప్రభావం మన బ్రెయిన్ లో ఉండే రక్తనాళాల మీద పడి అవి సంకోచం అయ్యేలా చేస్తాయి.ఇలా బ్రెయిన్ లో ఉండే రక్తనాళాలు సంకోచం చెందితే బ్రెయిన్ కణాలకు రక్తప్రసరణ అనేది ఆగిపోతుంది.అప్పుడే మనకు విపరీతంగా తలనొప్పి వస్తుంది. ఈ రెండు కారణాల వలన మొబైల్స్ చూసే వారిలో తలనొప్పి వస్తుంది.అంతేకాకుండా ఫోన్ రేడియేషన్ వలన డిఎన్ఏ బలహీనపడే అవకాశం కూడా ఉంది.
రెడియేషన్ తగ్గించుకోవడం ఎలా అంటే..?
ఫోన్ రేడియేషన్ పడకుండా ఉండాలంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి.రెండు ఇయర్ ఫోన్స్ కూడా ఒకేసారి పెట్టుకోకుండా రెండిటిలో ఏదో ఒకటి మాత్రమే పెట్టుకోవాలి. అలాగే బ్రెయిన్ హిట్ ను తగ్గించడానికి మంచినీళ్లను ఎక్కువగా తాగడం,రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి. మెదడును ప్రశాంతంగా ఉంచడం కోసం వీలైతే ప్రాణాయామం కూడా చేయాలి.ఇలా చేస్తే బ్రెయిన్ హీట్ అవ్వడం తగ్గి తలనొప్పి. తగ్గుతుంది.సాధ్యమైనంత వరకు ఫోన్ ను అవసరమైన పనుల కోసం మాత్రమే ఉపయోగించాలి కానీ అనవసరమైన పనులకు ఫోన్ వాడకుండా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది.