గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రి ఐసీయూలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ఐసీయూలోని రోగులను మరో వార్డుకు తరలించారు. ఆసుపత్రి అధికారులు ఇచ్చిన సమాచారంతో ఆగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనతో మిగిలిన వార్డుల్లోని రోగులు భయాందోళనకు గురి అవుతున్నారు.
విషయం తెలుసుకున్న స్థానిక నేతలు ఆసుపత్రికి చేరుకుని ఘటన గురించి తెలుసుకుంటున్నారు. పోలీసు అధికారులు ఆసుపత్రికి చేరుకుని ఘటనపై విచారణ జరుపుతున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.