I-PAC: టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రత్యేక విమానంలో నారా లోకేష్ తో కలిసి గన్నవరం వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన సమావేశమైయ్యారు. దాదాపు మూడు గంటల పాటు భేటీ జరిగింది. ఇదే ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో ఐపాక్ బాస్ గా రాష్ట్రంలో వైసీపీ గెలుపునకు పని చేశారు.
ఇప్పుడు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఐపాక్ కీలక ప్రకటన విడుదల చేసింది. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గెలుపు కోసం తాము పని చేస్తున్నట్లు పేర్కొంది ఐపాక్. ఐపాక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్ కు మా వంతు తోడ్పాటు అందిస్తాం.. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సీపీ తో కలిసి పని చేస్తున్నాం..2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గెలుపు కోసమే మేము పని చేస్తాం’ అని స్పష్టం చేసింది.
చాలా కాలం క్రితమే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ నుండి తప్పుకున్నారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ .. చంద్రబాబుతో భేటీ అయిన నేపథ్యంలో సామాన్యుల్లో కలిగే సందేహాలను నివృత్తి చేసేందుకే ఐపాక్ ఈ విధంగా ప్రకటన చేసి ఉండవచ్చని సమాచారం. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ ఆయన వ్యక్తిగతం, ఐపాక్ కు సంబంధం లేదు అన్నట్లుగా తెలిపే ఉద్దేశం వెల్లడైంది.
కాగా, చంద్రబాబుతో భేటీ అనంతరం తిరుగు ప్రయాణంలో గన్నవరం విమానాశ్రయం వద్ద ప్రశాంత్ కిషోర్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. చంద్రబాబు సీనియర్ నేత..అందుకే మర్యాదపూర్వకంగా ఆయననను కలిసేందుకు వచ్చా. దీనిపై ఎలాంటి ఊహగానాలు వద్దు అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పి పీకే అక్కడ నుండి వెళ్లిపోయారు.
AP Politics: ఏపీ ఎన్నికల్లో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు..ఏ పార్టీకి ప్లస్ .. ఏ పార్టీకి మైనస్..?
I-PAC has been working in collaboration with @YSRCParty since last year. Together, we're dedicated to working tirelessly until @ysjagan secures a thumping victory again in 2024 and continues his unwavering efforts to better the lives of the people of Andhra Pradesh.
— I-PAC (@IndianPAC) December 23, 2023