PV Sindhu: ప్రభుత్వ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు నేడు ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖలో అకాడమీ ఏర్పాటునకు రెండు ఎకరాల స్థలం కేటాయించినందుకు సీఎం జగన్ కు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. జూలై 23వ తేదీ నుండి ఆగస్టు 8వ తేదీ వరకూ జపాన్ లోని టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్ కు ఏపి నుండి భారత దేశం తరపున పాల్గొంటున్న క్రీకాడారులు పివి సింధు, ఆర్ సాత్విక్ సాయిరాజ్, రజనీలకు జగన్ అభినందనలు తెలియజేశారు. ఒకొక్కరికి రూ.5లక్షల చెక్కులను అందజేశారు.
Read more: Central Cabinet: ఏపీకి పెద్ద హ్యాండ్ ఇవ్వబోతున్న మోడీ..!
ఇదే సందర్భంలో విశాఖలో బాడ్మింటన్ ఆకాడమి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జివోను సీఎం జగన్ అందజేశారు. రజనీ (ఉమెన్స్ హాకీ ప్లేయర్) బెంగళూరు శిక్షణలో ఉన్నందున ఆమె కుటుంబ సభ్యులకు జగన్ కలిశారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రామ్ గోపాల్ తదితరుల పాల్గొన్నారు.