Kadapa Blast: కడప జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. ముగ్గురాళ్ల గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది మృత్యువాత పడ్డారు.
కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లి శివారులో ఉన్న ముగ్గురాళ్ల గనిలో బాంబు పేలడంతో పది మంది మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు. ముగ్గురాళ్లు తొలగించేందుకు జిలిటెన్ స్టిక్స్ పేలుస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.