YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించలేదు. అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ వాదనలు వినే సమయం లేదని హైకోర్టు తెలిపింది. ఇప్పటికిప్పుడు ఒక్క రోజులో వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం వీలుకాదని ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ స్పష్టం చేశారు. రేపటి నుండి కోర్టుకు వేసవి సెలవుల దష్ట్యా .. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జూన్ 5కు వాయిదా వేశారు.
కాగా, సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని, ఉత్తర్వులు ఇవ్వాలని అవినాష్ తరపు న్యాయవాది వాదించారు. వేసవి సెలవుల్లో కోర్టులో విచారణ జరపాలని కోరగా, విచారణ అత్యవసరమైతే ప్రధాన న్యాయమూర్తిని కోరాలని జస్టిస్ సురేంద్ర సూచించారు. సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా కనీసం రెండు వారాలైనా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ తరపు న్యాయవాది కోరగా .. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో తమపై ఒత్తిడి చేయవద్దని సీజే స్పష్టం చేశారు. అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు విచారణ వాయిదా పై ఉత్తర్వుల కాపీని కోరడంతో రాత్రి వరకు లేదా రేపు ఇస్తామని తెలిపారు.
Tadepalligudem (west Godavari): కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసి..