Nimmagadda ramesh : నిమ్మగడ్డ రమేష్ కుమార్ … ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి. సహజంగా రాజకీయ నాయకులు అధికారులను ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తుంటే … నిమ్మగడ్డ రమేష్ మాత్రం తన నిర్ణయాలతో నాయకులకు చెమటలు పట్టిస్తున్నారు. అయితే అదే సమయంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
తాజాగా మళ్లీ మున్సిపల్ ఎన్నికలతో హీట్ మరింత పెంచేశారు. ఆగిన చోట నుంచే మళ్లీ పుర పోరు ప్రారంభం కానుండటంపై పార్టీలు గగ్గోలు పెడుతుంటే….ఎన్నికల నిర్వహించే ఉన్నతాధికారి అయిన నిమ్మగడ్డ మాత్రం తిరుమలలో ప్రశాంతంగా సేద తీరుతున్నారు. మూడు రోజులుగా తిరుమలలోనే మకాం వేసి స్వామివారిని దర్శించుకుంటూ కుటుంభ సభ్యులుతో కాలక్షేపం చేస్తున్న ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కూమార్ తీరు చూస్తుంటే నిమ్మగడ్డ గారు మీరు సూపరండి అంటూ కొందరు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.
Nimmagadda ramesh నిమ్మగడ్డ కాక మామూలుగా లేదుగా…
నిమ్మగడ్డ రమేష్ కుమార్ సారథ్యంలోని రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో గతంలో మధ్యలో ఆగిపోయిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను, తిరిగి అక్కడ నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విపక్షాలు షాక్ అయ్యాయి. ఏపీలో ఓవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే మున్సిపల్ ఎన్నికలకు కూడా షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసేయడంతో ఎన్నికల ప్రక్రియలో ముందుకు వెళ్లడంపై తలమునకలు అవుతున్నాయి ఏపీలోని రాజకీయ పార్టీలు.
ఇప్పుడేం జరగనుంది?
గతంలో మధ్యలో ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను, తిరిగి అక్కడ నుంచే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 12 మునిసిపల్ కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయితీల్లో ఎన్నికల ప్రక్రియను కొనసాగించనున్నారు. శ్రీకాకుళం, రాజమండ్రి, నెల్లూరు కార్పోరేషన్లకు ఎలక్షన్స్ లేవు. కోర్టు కేసుల కారణంగా ఎన్నికల నిర్వహణను ఎస్ఈసీ పక్కన పెట్టింది. అలానే కొత్త మున్సిపాల్టీల్లో ఎన్నికలను కూడా ప్రస్తుతానికి ఎస్ఈసీ టచ్ చేయలేదు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో ఇవాళ నుంచి అర్బన్ ప్రాంతాల్లోనూ ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. అయితే, మున్సిపల్ ఎన్నికలకు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తే బాగుండేదని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
సర్ ఎక్కడంటే…
మరోవైపు రాజకీయ పార్టలు వ్యూహాల్లో మునిగి తేలుతుంటే…సీఈసీ రమేష్ కుమార్ అన్నింటికి దూరంగా కుటుంభ సభ్యులుతో తిరుమలలో ప్రశాంతంగా గడుపుతున్నారు. శనివారం రాత్రి తిరుమల చేరుకున్న రమేష్ కుమార్…. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అటు తరువాతా గదికే పరిమితం అయ్యారు. సోమవారం ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకున్న రమేష్ కుమార్….అటు తరువాతా కుటుంభ సభ్యులుతో కలసి శనకనందతీర్దం, పాపవినాశనం డ్యాంలను సందర్శించారు. అటు తరువాతా పద్మావతి అతిథి గృహంకు చేరుకున్నారు.