NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వారాహి యాత్రలో అపశృతి .. ఓ అభిమాని మృతి

Advertisements
Share

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో తొలి రోజే అపశృతి చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా కత్తిపూడిలో సభ వేదిక వద్ద జరిగిన ప్రమాదంలో ఓ జనసైనికుడు ప్రమాదవశాత్తు ట్రాన్స్ ఫార్మర్ పై పడి మరణించాడు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు కత్తిపూడి బహిరంగ సభకు విచ్చేశారు. ఈ క్రమంలో ఓ యువకుడు పవన్ ను చూసేందుకు లైట్ స్టాండ్ ఎక్కాడు. దానిపై పట్టుతప్పడంతో ట్రాన్స్ ఫార్మర్ పై పడ్డాడు.

Advertisements
Pawan Varahi Yatra

 

విద్యుత్ షాక్ తో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన యువకుడి సమాచారంపై ఆరా తీస్తున్నారు. వారాహి విజయ యాత్ర మొదటి రోజే ఇలా అపశృతి చోటుచేసుకోవడంతో జనసైనికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన జనసేన నేతలు .. ఎవరూ విద్యుత్ స్తంబాలు ఎక్కవద్దని సూచించారు.

Advertisements

Achampeta (palnadu): ఉయ్యాలలో నిద్రిస్తున్న పసిపాప మంటల్లో సజీవ దహనం


Share
Advertisements

Related posts

Charging: మీ ఫోన్ స్లో గా ఛార్జింగ్ అవుతుందా? అయితే ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఇలా చెయ్యండి!!

Naina

రోజా కేరాఫ్ ఇన్ సెక్యూరిటీ… వైకాపాలో ఎంతమంది యాంటీ?

CMR

సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. అయిదుగురు దుర్మరణం

somaraju sharma