ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు కాకినాడలో పరాభవం జరిగింది. ఇంతకు ముందు ఆయనకు అనుచరుడుగా ఉన్న సిపీఎంసీ విద్యాసంస్థకు చెందిన రత్నాకర్ యే పాల్ కు షాక్ ఇచ్చారు. కేఏ పాల్ కాన్వాయ్ లోని రెండు వాహనాలను రత్నాకర్ స్వాధీనం చేసుకున్నారు. వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా కేఏ పాల్ బుధవారం కాకినాడ చేరుకున్నారు. కేఏ పాల్ తన కార్లను తాను బస చేసిన హోటల్ లో పార్కింగ్ చేయాలని చూశారు. అతని అనుచరుడు రత్నాకర్ వచ్చి హోటల్ లో ఎందుకు తన విద్యాసంస్థ కాంపౌండ్ లో పార్క్ చేద్దామని చెప్పారు. దీంతో రత్నాకర్ మాట విన్న కేఏ పాల్ .. తన కాన్వాయ్ లోని రెండు కార్లను రత్నాకర్ విద్యాసంస్థ కాంపౌండ్ లో పార్క్ చేశారు. కార్లు పార్క్ చేసిన కాసేపటికి కాంపౌండ్ గేట్లకు తాళం వేసి వెళ్లిపోయాడు రత్నాకర్.
గురువారం పాల్ ఏలూరు పర్యటనకు వెళ్లేందుకు బయలుదేరేందుకు సిద్దమైయ్యారు. తమ కార్లు తీసుకుందామని వెళ్లిన కేఏ పాల్ కారు డ్రైవర్లకు అక్కడకు వెళ్లగా గేట్లకు తాళం వేసి ఉండటంతో షాక్ అయ్యారు. రత్నాకర్ కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. అయితే కేఏ పాల్ మనుషులు కాంపౌండ్ లోకి ప్రవేశించి కార్లు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా విద్యాసంస్థ సిబ్బంది అడ్డుకున్నారు. రత్నాకర్ చేబితేనే గేటు తాళాలు ఓపెన్ చేస్తామని చెప్పారు. దీంతో కేఏ పాల్ మనుషులు, బౌన్సర్ లు విద్యాసంస్థ సెక్యురిటీ సిబ్బందితో వాదనకు దిగారు. దీనిపై కేఏ పాల్ ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
కేఏ పాల్ కు తాను భారీగా డబ్బులు అప్పుగా ఇచ్చాననీ, కాని ఇప్పటి వరకూ ఆ అప్పు తీర్చలేదనీ రత్నాకర్ చెబుతున్నారు. తీసుకున్న అప్పు తీర్చమని అడిగితే బెదిరిస్తున్నారనీ ఆరోపించారు. ఆ డబ్బులు పాల్ నుండి వసూలు చేసుకునేందుకే రెండు కార్లు తన ఆధీనంలో ఉంచుకున్నట్లు తెలిపారు. రత్నాకర్ విద్యాసంస్థ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు విద్యాసంస్థ కాంపౌండ్ గేటు తెరిపించి కేఏ పాల్ కాన్వాయ్ వాహనాలను విడిపించారు. తన వద్ద కోట్ల రూపాయలు ఉన్నాయంటూ ప్రగల్భాలు పలుకుతూ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులపై సంచలన కామెంట్స్ చేసే కేఏ పాల్ కు కాకినాడలో ఈ విధమైన పరాభవం ఎదురుకావడం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది.
పార్లమెంట్ ఆవరణలో సస్పెండైన ఎంపీలు ఇలా..