నైరుతి బంగాళాఖాతంలో హీందూ మహాసముద్రానికి అనుకుని కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ నేడు నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు. ఈ వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగాా కొమరిన్ ప్రాంతం వైపు వెళ్లే అవకాాశం ఉందని అంటున్నారు. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తమిళనాడు లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్ప పీడన ప్రభావంతో ఏపిలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, పెద్దగా ప్రభావం ఉండదని చెప్పారు.
ఈ నెల 24 నుండి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారుుల తెలిపారు. ఈశాన్య గాలుల కారణంగా ఏపిలో చలి ప్రభావం పెరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా దట్టమైన పొగమంచు అలుముకుంటుందని చెప్పారు. అల్పపీడన ప్రభావం రాష్ట్రంలో 28వ తేదీ వరకూ ఉంటుందని ఏపి వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. ఈ ప్రభావంతో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెబుుతన్నారు. రాష్ట్రంలో రాత్రి సమయాల్లో బాాగా చలిగా ఉండే అవకాశం ఉందని చెప్పారు.
టీడీపీ అనుకూల మీడియాపై మరో సారి ఫైర్ అయిన విజయసాయి రెడ్డి