ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగి కేబినెట్ భేటీ ముగిసింది. మంగళవారం సచివాలయం మొదటి బ్లాక్ కెబినెట్ సమవేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ లు పంపిణీకి కెబినెట్ ఆమోదం తెలిపింది. సామాజిక పెన్షన్ ను మరో 250 లు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఇవి కెేబినెట్ ఆమోదించిన అంశాలు
- వైఎస్ఆర్ పశు భీమా పథకానికి కేబినెట్ ఆమోదం
- ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ క్లాసులు, ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ రూమ్లను నాడు నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- రూ.2500లు ఉన్న పెన్షన్ ను వచ్చే నెల నుండి రూ.2750లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం
- ఏపి పంప్డ్ స్టోరేజ్ పవన్ ప్రమోషన్ పాలసీకి కేబినెట్ ఆమోదం
- భూముల రీసర్వే కోసం మున్సిపాలిటీ చట్ట సవరణతో పాటు బాపట్ల, పల్నాడు అర్బన్ డవలప్ మెంట్ అథిరిటీల ఏర్పాటునకు కేబినెట్ ఆమోదం
- కొత్త జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల నిర్మాణాలకు స్థలాల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్
- సీఎం జగన్ పుట్టిన రోజైన డిసెంబర్ 21న 5లక్షల మంది 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ ల పంపిణీకి కేబినెట్ ఆమోదం
- జిందాల్ స్టీల్ భాగస్వామిగా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
- ఏపి జ్యూడీషియల్ అకాడమి లో 55 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం
- హెల్త్ హబ్స్ ఏర్పాటునకు కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం
- టీటీడీలో కొన్ని శాఖలకు ప్రచారం కోసం చీఫ్ సీఈఓ పోస్టు భర్తీకి ఆమోదం
తవాంగ్ ఘటనపై లోక్సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన వివరణ ఇది