సింహాచలం శ్రీవరహా లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం (స్వామి వారి నిజరూప దర్శనం) వైభవంగా జరిగింది. ఇవేళ తెల్లవారుజారుజామున నాలుగు గంటల నుండి సర్వదర్శనం ప్రారంభమైంది. ఆలయ సంప్రదాయం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ అనువంశిక దర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, వారి కుటుంబ సభ్యులు తొలి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 3.30 గంటల నుండి 4 గంటల మధ్య ప్రభుత్వం తరపున స్వామి వారికి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, తిరుమల నుండి టీడీపీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేకువ జాము నాలుగు గంటల నుండి సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించారు.
ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకూ, తిరిగి 8 గంటల నుండి 10 గంటల వకూ వీఐపీ లకు దర్శనం కల్పించారు. పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. స్వామివారి నిజరూపాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులను నియంత్రించలేక అధికారులు చేతులు ఎత్తేశారు. ప్రవేశ ద్వారం వద్ద తోపులాట జరిగింది. అరకొర ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో పక్క స్వామివారి చందనోత్సవంలో పాల్గొన్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి భక్తుల ఇబ్బందులపై తీవ్రంగా స్పందించారు. ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు స్వరూపానందేంద్ర సరస్వతి. పేదలకు దేవుడిని వీఐపీల కోసం దూరం చేస్తారా అంటూ మండిపడ్డారు. సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరించారని ఆరోపించారు. పెద్ద ఎత్తున పోలీసులను అయితే ఏర్పాటు చేశారు కానీ ఏర్పాట్లు సరిగా లేవని మండిపడ్డారు. తన జీవితంలో తొలి సారి ఇలాంటి చందనోత్సవానికి హాజరయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దర్శనానికి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నట్లు తెలిపారు. కొండ కింద నుండి పై వరకూ రద్దీ ఉన్న జవాబు చెప్పేవారు లేరని తెలిపారు. భక్తుల ఆర్తనాదాలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు స్వరూపానందేంద్ర సరస్వతి. భక్తుల ఇబ్బందుల మధ్య అప్పన్న దర్శనం బాధ కల్గించిందన్నారు. ఇలాంటి చందనోత్సవ నిర్వహణ ఎప్పూడు జరగలేదని ఆయన ఆరోపించారు.
Breaking: అమృత్ పాల్ సింగ్ అరెస్టు