TDP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టీడీపీ దుస్థితిపై ఆయన కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. టీడీపీ క్యాడర్ ను చంద్రబాబు, లోకేష్ వాడుకుని వదిలివేస్తున్నారని ఓ టీడీపీ నేత అచ్చెన్నాయుడు ముందు ఆవేదన వ్యక్తం చేయడం, దానిపై అచ్చెన్న మాట్లాడుతూ లోకేష్ ను ఉద్దేశించి ఆయనే సరిగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదని అన్నారు. అనంతరం 17 తరువాత ఫ్రీ అయిపోతాం, ఆ తరువాత పార్టీ లేదు, బొక్కా లేదు అందూ కామెంట్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ కావడంతో అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
“నువ్వు నీ దొంగ సాక్షి ఎన్ని తప్పుడు వీడియోలు వేసినా టీడీపీలో విభేదాలు సృష్టించలేవు జగన్ రెడ్డి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారి నాయకత్వంలో తిరుపతి ఎన్నికలకు ఐకమత్యంగా పని చేస్తుండటంతో నీకు ఓటమి భయం పట్టుకుంది. నారా లోకేష్ విసిరిన సవాల్ కి తోకముడిచావు, నిన్న బాబు గారి సభపై రాళ్లు వెయించావు, ఈ రోజు నా సంబాషణల్ని వక్రీకరించావు, ఎన్ని విష పన్నాగాలు పన్నినా తెలుగుదేశం విజయాన్ని అపలేవు, నారా లోకేష్ తో నా కున్న అనుబంధాన్ని విడదీయలేవు’ అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.
నిన్న బాబుగారి సభపై రాళ్లేయించావు. ఈ రోజు నా సంభాషణల్ని వక్రీకరించావు. ఎన్ని విషపన్నాగాలు పన్నినా తెలుగుదేశం విజయాన్ని ఆపలేవు. నారా లోకేష్తో నాకున్న అనుబంధాన్ని విడదీయలేవు. (2/2)@ysjagan
— Kinjarapu Atchannaidu (@katchannaidu) April 13, 2021